యూట్యూబర్ ప్రశ్న రావణ్పై అత్యంత కఠినమైన UAPA (అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం కింద రాజద్రోహం కేసు నమోదైంది. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాడని ఆరోపణ.
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Prashna Ravan UAPA Case | నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై జనసేన నేత ఫిర్యాదుతో తాజాగా గన్నవరంలో రాజద్రోహం, ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదైంది.

- యూట్యూబర్ ప్రశ్న రావణ్పై UAPA కింద రాజద్రోహం కేసు నమోదు.
- దేశ సార్వభౌమత్వానికి భంగం, అశాంతి రేకెత్తించారని గన్నవరంలో ఫిర్యాదు.
- నాలుగు కేసులలో బెయిల్ వచ్చినా, కఠిన సెక్షన్లతో పోలీసులు అరెస్టు.
- ప్రశ్నించేవారి గొంతు అణచివేయడమేనని లాయర్, నాయకుల విమర్శ.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ (Prashna Ravan) వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే వరుసగా నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యి, ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ పొంది విడుదలైన ప్రశ్న రావణ్కు చిక్కులు తప్పడం లేదు. తాజాగా ఆయనపై అత్యంత కఠినమైన రాజద్రోహం కేసును నమోదు చేశారు. దేశంలోనే అత్యంత కఠినమైన చట్టంగా పరిగణించే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్—(UAPA) కింద ఈ కేసు నమోదైంది.
గన్నవరంలో జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ప్రశ్న రావణ్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న వ్యాఖ్యల ద్వారా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు తీవ్ర భంగం కలిగిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఈ కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రశ్న రావణ్పై భారతీయ న్యాయ సంహిత (BNS),ఉపా చట్టంలోని పలు కఠినమైన సెక్షన్లను చేర్చారు. ఇందులో U/s 147, 148, 152, 192, 197(1)(d), 353(1)(b) తో పాటు యుఏపీఏ యాక్ట్ 1967 (UAPA Act 1967) లోని సెక్షన్ 13, సెక్షన్ 39 కింద గన్నవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. వరుసగా బెయిళ్లు వస్తున్న నేపథ్యంలో, అతన్ని అదుపులో ఉంచేందుకే పోలీసులు ఈ తీవ్రమైన సెక్షన్లను ప్రయోగించారని అతడి లాయర్ జడ శ్రవణ్ కుమార్, వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని విమర్శించారు. నటుడు ప్రకాష్ రాజ్ సైతం ప్రశ్న రావణ్కు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ను ప్రశ్నించాడని ఓ వ్యక్తిని పదే పదే అరెస్ట్ చేస్తున్నా కోర్టులు బెయిల్ ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. రావణ్పై నమోదైనవి ఉద్దేశపూర్వకంగానే పెట్టిన కేసులు అని ఆరోపించారు.
అత్యంత కఠినమైన సెక్షన్లతో ప్రశ్న రావణ్ పై కేసు నమోదు
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, ఆయనపై మోపిన సెక్షన్ల గురించి ఆయన తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు.. గన్నవరం పోలీసులు రావణ్పై ఎఫ్ఐఆర్ నంబర్ 188/2026 కింద అత్యంత కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. రావణ్పై సెక్షన్ 147, 148, 152, 192, 197, ఉపా (UAPA) చట్టంలోని సెక్షన్ 39 కింద కేసులు పెట్టారని ఆయన వివరించారు. ముఖ్యంగా సెక్షన్ 147 అనేది ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం లేదా దానికి ప్రయత్నించడం వంటి నేరాలకు వర్తిస్తుందని, దీనివల్ల మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
గరిపాటి శివశంకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. జూన్ 28, 2026న గన్నవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో రావణ చేసిన ప్రసంగం నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థను కీర్తించేలా ఉందని, యువతను తీవ్రవాద భావజాలం వైపు ప్రేరేపించేలా ఉందని పోలీసులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆ సభలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ మాట్లాడారే తప్ప, మావోయిస్టుల ప్రస్తావన ఎక్కడా రాలేదని న్యాయవాది స్పష్టం చేశారు
ప్రభుత్వ వైఖరిపై విమర్శలు
రావణ్పై ఉన్న పాత సోషల్ మీడియా కేసుల్లో బెయిల్ వస్తుండటంతో, ఆయనను ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చీకటి ఒప్పందం చేసుకుందని శ్రవణ్ కుమార్ విమర్శించారు. రావణ్పై ఉన్న సుమారు 102 కేసుల్లో వరుసగా పిటి (PT) వారెంట్లు వేస్తూ, ఒకటి రెండు ఏళ్ల పాటు ఆయనను జైలుకే పరిమితం చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆయన మండిపడ్డారు. ఒక యూట్యూబర్ను దేశద్రోహిగా, తీవ్రవాదిగా చిత్రీకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు
పోలీసులు సమర్పించిన వీడియో ఆధారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతికతతో మానిప్యులేట్ చేసినవి అయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకను అణచివేయడానికి 164 సీట్లను, అధికార బలాన్ని వాడుకుంటున్నారని, ఈ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు 2029 ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారని జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు
Frequently Asked Questions
యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ఏ చట్టం కింద రాజద్రోహం కేసు నమోదైంది?
ప్రశ్న రావణ్పై రాజద్రోహం కేసు నమోదుకు కారణం ఏమిటి?
జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. రావణ్ తన వ్యాఖ్యల ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగిస్తూ, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రశ్న రావణ్పై ఈ కేసుతో పాటు ఇతర కేసులు ఉన్నాయా?
అవును, ఇదివరకు నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యి, బెయిల్ పొందిన తర్వాత తాజాగా UAPA కింద ఈ రాజద్రోహం కేసు నమోదైంది. అతడిని అదుపులో ఉంచడానికే ఈ కేసులు పెడుతున్నారని లాయర్లు ఆరోపిస్తున్నారు.
ప్రశ్న రావణ్పై నమోదైన కేసులపై ఏమైనా విమర్శలు ఉన్నాయా?
అవును, అతడి లాయర్, వైఎస్సార్సీపీ నేతలు, నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ కేసులు ఉద్దేశపూర్వకంగానే పెట్టినవని ఆరోపించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.
ట్రెండింగ్ వార్తలు






















