అన్వేషించండి

AP Politics: రాజ్యసభ అభ్యర్థులను గెలిపిస్తామని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు- టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల సంచలనం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే తమను అడుగుతున్నారని అన్నారు.

Mla Gorantla Comments : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ (Rajamundry Rural) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchhaiah Chowdary ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే తమను అడుగుతున్నారని అన్నారు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే... గెలిపిస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారని వెల్లడించారు. దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. 

50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు!
అధికార పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు... తమకు టచ్ లోకి వచ్చారని, రాజ్యసభ ఎన్నికలపై సంప్రదింపులు జరుపుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే...ఇప్పుడు ఆమోదించాల్సిన అవసరం ఏముందన్నారు.  గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో మూడేళ్ల పాటు స్పీకర్, సీఎం గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామనే...రాజీనామాను ఆమోదించారని అన్నారు. రాష్ట్రం బాగుండాలనే వైసీపీ చెందిన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 

సామాజిక న్యాయం ఎక్కడుంది ?
జగన్‌ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అంబేడ్కర్‌ విగ్రహం పేరుతో దోపిడీకి పాల్పడ్డారన్న ఆయన... కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందన్నారు. జగన్ వ్యవస్థల మేనేజ్మెంట్ పతాక స్థాయికి చేరిందన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, న్యాయమూర్తి ఇంటికి రెండు కోట్ల రూపాయల విలువైన వజ్రాల వాచీ పంపాడని ఆరోపించారు. ఏళ్లుగా బెయిల్ మీద ఉంటూ, తనపై కోర్టులో ఉన్న కేసుల విచారణ ముందుకు సాగకుండా రాజ్యాంగ వ్యవస్థల మేనేజ్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. అందు కోసం ఎన్ని వజ్రాల వాచీలు, ఎన్ని వేల కోట్లు వెచ్చించాడో అంటూ విమర్శించారు. ఈ పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికి రారన్న ఆయన...రాష్ట్ర ప్రగతికి శాపం జగన్ మోహన్ రెడ్డేనన్నారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 

ఫిబ్రవరి నెలాఖరులో ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత, నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ పదవీకాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది. దీంతో ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. రాజ్యసభ ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. వైసీపీకి పూర్తి బలం ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ అధినేత జగన్... ఎక్కడో తేడా కొడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో వారంతా... వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా... ఎంపీ స్థానం చేజారిపోయే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి...ఈ సారి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Amaravati Latest News: రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Embed widget