అన్వేషించండి

Vijayawada: ఆఫ్రికాలో ఇప్పుడు కనిపించే కరవును ఎప్పుడో చూసిన విజయవాడ- ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం వెనుక లక్షల మంది చావు ఉందా?

Prakasam Barrage: విజయవాడ వరద చూశాం కానీ ఇక్కడే లక్షల మందిని చంపిన డొక్కల కరవు గురించి తెలుసా? పంటల్లేక నీరు అందక గుంటూరు విజయవాడ మాత్రమే కాదు చెన్నై రహదారి మొత్తం శవాల గుట్టలే కనిపించాయి.

Vijayawada Floods: ఇప్పుడంటే వరదలతో విలవిలలాడుతున్న బెజవాడను చూస్తున్నాం. ఈ విపత్తు జల ప్రళయంగా మారకుండా కాపాడిన ప్రకాశం బ్యారేజ్ గురించీ చెప్పుకుంటున్నాం. కానీ ఇదే ప్రాంతంలో ఒకప్పుడు వ్యవసాయానికి నీరు అందక ఏర్పడ్డ కరవు లక్షల మందిని చంపేసింది అని విన్నారా. దాని కారణంగానే విజయవాడ, గుంటూరు మధ్య ప్రకాశం బ్యారేజ్ ఏర్పడింది అని తెలుసా!

బ్రిటీష్ ప్రభుత్వాన్నే భయపెట్టిన డొక్కల కరవు 
బ్రిటీష్ హయాంలో ఇంకా కృష్ణమ్మపై బ్యారేజ్ ఏర్పడక ముందు వచ్చిన నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి వెళ్ళిపోయేదే. నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కాదు. అప్పటికే చారిత్రకంగా పాలనాపరంగా విజయవాడ, గుంటూరు చాలా పెద్ద పట్టణాలు. అలాంటి సమయం అంటే 1832-33 సంవత్సరాల్లో విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో కరవు ఏర్పడింది. అంతకు ముందు ఏడాది 1831లో భారీ వర్షాలు కురిసి రైతుల పంటను సర్వ నాశనం చేశాయి. ఆపై ఏడాది భీకర తుపాను వచ్చి వ్యవసాయాన్ని దెబ్బ తీసింది. 

Also Read: బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్

వరుసగా రెండేళ్లు పంట నాశనం కావడంతో రైతులకు విత్తనాలు దొరకలేదు. పైగా బ్రిటీష్ వాళ్ల పన్నుల వసూళ్లు జనం దగ్గర ఉన్న కొద్ది డబ్బునూ ఖాళీ చేశాయి. అటు పంటలూ లేక ఇటు డబ్బూ పోయి ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన కరవు ఏర్పడింది. ఈ కరవు ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే ప్రజల దగ్గర తినడానికి తిండి లేక శరీరం కుంగిపోయి ఎముకలు ఎండిపోయి డొక్కలు బయటకు కనపడేవి. అంటే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అప్పుడు ఉండేదన్నమాట. అందుకే దీనికి డొక్కల కరువు అని తరువాతి కాలంలో పేరు పెట్టారు .

గుంటూరులోనే 2 లక్షల మంది మృతి
ఈ డొక్కల కరవు కారణంగా ఒక్క గుంటూరు ప్రాంతంలోనే రెండు లక్షల మంది చనిపోయినట్టు నాటి రికార్డ్స్ చెబుతున్నాయి. అందుకే ఈ కరవుకు గుంటూరు కరువు అని కూడా పేరు. ఆ ఏరియాలో అప్పటి జనాభా 5 లక్షలు. వారిలో ఏకంగా రెండు లక్షల మంది కరవు కారణంగా తిండి లేక చనిపోయారు. కృష్ణా నదిలో నీళ్ళు ఉన్నా వాడకోలేని పరిస్థితి .
డొక్కల కరవు కాలంలో జనానికి తిండి లేక ఏది దొరికితే అది తినేవాళ్లు.  ప్రమాదకరమైన ముళ్ళ చెట్ల కాయలను కూడా తిని ప్రాణం కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ కరవు ప్రభావం విజయవాడ గుంటూరు పై మాత్రమే కాకుండా చెన్నై వరకూ వ్యాపించింది. విజయవాడ - చెన్నై రహదారిపై ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనపడేవి అంట. 
ఈ కరవు కలిగించిన దుష్ఫలితాలు ఆ తరువాత 20 ఏళ్ల పాటు ఆ రెండు పట్టణలపైనే కాకుండా ఆంధ్ర ప్రాంతంపై కూడా పడింది. ఇవన్నీ నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి కాబట్టి దాని ఆదాయం సగానికిపైగా దెబ్బతిన్నది అని బ్రిటీష్ రాతల్లో స్పష్టంగా ఉంది .

Also Read: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి, కౌంటర్ వెయిట్స్ ఫిక్స్ చేసిన కన్నయ్యనాయుడు

కరవు ఫలితం -బ్యారేజ్ నిర్మాణం.
ఈ కరవు దెబ్బతో మరోసారి ఇలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికి నీరు నిల్వ చేసుకోవడమే మార్గం అని బ్రిటీష్ ప్రభుత్వం భావించింది.  దీంతో గుంటూరు విజయవాడ మధ్య ఒక బ్యారేజ్ కట్టాలని నిర్ణయించింది. అప్పటికే గోదావరిపై బ్యారేజ్ నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాటన్ సూచనలతో ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్ కు కాస్త ఎగువన బ్యారేజ్ నిర్మించారు. ఇది 1853లో 1132 మీటర్ల పొడవుతో 1.49 కోట్ల రూపాయల ఖర్చుతో మొదలై 1854లో పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కాటన్ శిష్యుడు మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించాడు. బ్యారేజ్ నుంచి 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీరు వ్యవసాయ భూములకు అందేది. వందేళ్ళ పాటు సేవలందించిన ఆ ప్రాజెక్ట్ 1952లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది . 

1957లో అందుబాటులోకి వచ్చిన ప్రకాశం బ్యారేజ్ 
బ్రిటీష్ వాళ్ళు కట్టిన బ్యారేజ్ కొట్టుకు పోవడంతో 1954లో అప్పట్లో కొత్త ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. విజయవాడ సీతానగరం మధ్య కట్టిన ఈ బ్యారేజ్ పై 1957 డిసెంబర్ 24న రాకపోకలు మొదలయ్యాయి. పాత ప్రాజెక్ట్ కంటే ఈ ప్రాజెక్ట్ కాస్త పొడవు ఎక్కువ. దీని లెంగ్త్ 1223 మీటర్లు. 70 గేట్లతో రెడీ అయిన ఈ ప్రాజెక్ట్ ఏకంగా 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2.78 కోట్లు ఖర్చు అయ్యింది. 

ఆంధ్ర రాష్ర్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గౌరవార్థం ప్రకాశం బ్యారేజ్ అని దీనికి పేరు పెట్టారు. నాటి నుంచి విజయవాడను భారీ వరదల నుంచి కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ భూములను కరవు నుంచి కాపాడుతూ వస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LRS In Andhra Pradesh: ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LRS In Andhra Pradesh: ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Ikkis Box Office Collection Worldwide Total: ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
Embed widget