అన్వేషించండి

Roja: చంద్రబాబు జైలుకు వెళ్తే జనాలకు బాగా హ్యాపీ, బాలకృష్ణలా ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటారేమో - రోజా వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.

ఏదైనా కేసులో ఇరుక్కుంటే చంద్రబాబు దాన్ని ఎలా డైవర్ట్ చేస్తారో గతంలో చూశామని మంత్రి రోజా అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కూడా దర్జాగా ఉంటూనే ‘మా వాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ మాట్లాడారని గుర్తు చేశారు. తనపై కక్ష్య సాధిస్తున్నారని మాట్లాడుతూ సింపతీ డ్రామా చేస్తుంటారని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందున అదే సూత్రంతో ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఎవరైతే డబ్బు ఇచ్చారో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయనకు పీఏ అని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

దాదాపు 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇప్పుడు కొంతే బయటపడిందని మంత్రి రోజా ఆరోపించారు. ఇప్పటిదాకా పచ్చ పత్రికల సాయంతో వివిధ కేసుల విషయంలో తన తప్పేమీ లేదని నిరూపించుకోగలిగారని, ఇకపై అది కుదరదని రోజా అన్నారు. సొంత మనుషులే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా చంద్రబాబు అరెస్టు ఖాయం అయిపోయిందని రోజా ఆరోపించారు. 

చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందని అన్నారు. రూ.118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబు విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా? అని ప్రశ్నించారు. విచారణ నుంచి తప్పించుకొనేందుకు గతంలో బాలకృష్ణ తరహాలో మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటారా అని రోజా ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి విజయ్‌ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు, లోకేష్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ఆ పరిణామం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బాబు అడ్డంగా దొరికిపోయిన సందర్భంలో సానుభూతి డ్రామాలు ఆడటం ఆయనకు అలవాటు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదని.. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని అన్నారు. 2019లో ఎన్నికల ముందు కూడా మోదీ తనను అరెస్ట్‌ చేస్తారని చంద్రబాబు సింపతి డ్రామా ఆడారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్‌ చేయాలని.. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాలని మంత్రి రోజా డిమాండ్‌ చేశారు.

పెనమలూరు సమావేశానికి రోజా హాజరు

కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. హాజరై స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారధి ద్వారా నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలు రివ్యూ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షించి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులకు తెలియపరచి వాటికి తగు పరిష్కారాల కోసం చర్చించారు. తగిన సలహాలు సూచనలు చేసి ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని తద్వారా జగనన్నకు, జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు, జిల్లా అధ్యక్షులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని, పామర్రు శాసనసభ్యులు అనిల్, డీసీసీ బ్యాంకు జిల్లా ఛైర్ పర్సన్ పద్మావతి, స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఐదుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఐదుగురు దుర్మరణం
Balakrishna : వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ
వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ
Mass Jathara Glimpse: మాస్ జాతర... ఇదీ మాస్ మహారాజ్ రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది - గ్లింప్స్ చూశారా?
మాస్ జాతర... ఇదీ మాస్ మహారాజ్ రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది - గ్లింప్స్ చూశారా?
Horse Drawn Buggy: గణతంత్ర వేడుకలకు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి.. ఆ చరిత్ర తెలిస్తే వావ్​ అనాల్సిందే..!
గణతంత్ర వేడుకలకు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి.. ఆ చరిత్ర తెలిస్తే వావ్​ అనాల్సిందే..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఐదుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఐదుగురు దుర్మరణం
Balakrishna : వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ
వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ
Mass Jathara Glimpse: మాస్ జాతర... ఇదీ మాస్ మహారాజ్ రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది - గ్లింప్స్ చూశారా?
మాస్ జాతర... ఇదీ మాస్ మహారాజ్ రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది - గ్లింప్స్ చూశారా?
Horse Drawn Buggy: గణతంత్ర వేడుకలకు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి.. ఆ చరిత్ర తెలిస్తే వావ్​ అనాల్సిందే..!
గణతంత్ర వేడుకలకు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి.. ఆ చరిత్ర తెలిస్తే వావ్​ అనాల్సిందే..!
Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
Budget 2025: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
Republic Day 2025 :  రిపబ్లిక్ డే పరేడ్‌లో వైమానిక దళ ధ్వజ్ నిర్మాణ ప్రదర్శన - దీన్ని ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తారంటే..
రిపబ్లిక్ డే పరేడ్‌లో వైమానిక దళ ధ్వజ్ నిర్మాణ ప్రదర్శన - దీన్ని ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తారంటే..
AP Republic Day 2025 Celebrations: విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
Embed widget