అన్వేషించండి

Andhra Pradesh: సెప్టెంబర్ ఏడున ఏపీలో మద్యం షాపుల బంద్! ఎందుకంటే?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే తమ సంగతి తేల్చాలని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Liquor Policy In Andhra Pradesh: ఏపీలో త్వరలోనే కొత్త మద్యం పాలసీ తెరపైకి రానుంది. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిందని డిజిటల్ పిమెంట్స్ కు అనుమతి ఇవ్వకుండా కేవలం డైరెక్ట్ క్యాష్‌ తీసుకుంటూ  కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు అని కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ఆరోపిస్తోంది. సొంత మద్యం బ్రాండ్లతో అటు ప్రజల ఆరోగ్యం ఇటు ప్రభుత్వ ఖజానా రెండింటికీ దెబ్బకొట్టారు అని ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రచారం చేశారు. నిజానికి నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కాస్త ముందుగా మాత్రమే మద్యం దుకాణాల్లో డిజిటల్ పెమెంట్ లకు అనుమతి ఇచ్చింది. ఇవన్నీ నాటి పాలనపై అనుమానాలు సృష్టించింది అనేది స్పష్టం.

కొత్త మద్యం పాలసీని రెడీ చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రకటించిన వైట్ పేపర్స్ లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఏకంగా అసెంబ్లీలోనే శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసిన చంద్రబాబు గత వైసీపీ పాలనలో మద్యం టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. దేశ వ్యాప్తంగా మద్యం వినియోగం పెరిగిన వేళ పక్క రాష్ట్రాల్లో ఆదాయం పెరిగితే ఏపీలో మాత్రం తగ్గింది అన్నారు. అప్పటి పాలకులు ఏపీ ఖజానాకు రావల్సిన ఆదాయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడం వల్లే ఈ పరిస్థితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

అక్టోబర్ 1 నుంచి క్రొత్త మద్యం పాలసీ 

ప్రస్తుతం ఏపీలో మద్యం పాలసీ ఎలా ఉండాలి అనేదానిపై అధ్యయనం చేయడానికి మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. ఆ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, గొట్టిపాటి రవి, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వీరు పక్క రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న మద్యం పాలసీలను పరిశీలించి దానికి అనుగుణంగా కొత్త పాలసీకి తగిన సూచనలను ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారు. అనంతరం అక్టోబర్ 1 న ఏపీలో కొత్త మద్యం పాలసీని సీఎం ప్రకటిస్తారు.

Also Read:నెల రోజులు విదేశాలకు వైఎస్ఆర్‌సీపీ అధినేత - వచ్చే సరికి పార్టీ ఖాళీ అయిపోతుందా?

మరి మా సంగతి ఏమిటి - మద్యం షాపుల ఉద్యోగులు

కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి ప్రైవేటుపరం చేస్తారు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దానితో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు రోడ్డెక్కారు. ముందు తమ ఉద్యోగాల సంగతి తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేశారని  కానీ ఐదేళ్లుగా  పని చేస్తున్న తమకు సరైన సమయానికి జీతాలు ఇవ్వలేదని వారు అంటున్నారు. పైగా తమకు రావల్సిన PF,OT,ESIల డబ్బును కూడా ఏజెన్సీలు తినేసాయని ఆరోపిస్తున్నారు.  కొత్త ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇలా అర్దాంతరంగా తమను రోడ్డున పడేశారని వాపోతున్నారు. అందుకే కొత్త మద్యం పాలసీ ప్రకటించేలోపు తమ ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కోణంలోనే సెప్టెంబర్ 4 నుంచి నిరసనలు చేస్తామని సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ చేపడతామని ఏపీ బేవెరేజేస్ కాంట్రాక్ట్ అండ్‌ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 18వేల మంది వరకూ పనిచేస్తున్నారు. అన్నివేల కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేయకండి అంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: విజయవాడ ఎంపీగా గెలిస్తే రాజకీయ భవిష్యత్ సమాధి - ఇప్పటి వరకూ జరిగింది ఇదే - ఇదిగో లిస్ట్

టాప్ హెడ్ లైన్స్

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget