అన్వేషించండి

మోదీ టూర్ సందర్భంగా కాంగ్రెస్‌ భారీ నిరసన కార్యక్రమాలు

కాంగ్రెస్ పార్టీ నేతలు మోదీ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున ఆందోళనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అవ్వాల్సి వచ్చింది.

ఏపీలో మోదీ పర్యటనకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. నవంబర్ 11, 12 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నేతలు తీర్మానించారు. విజయవాడలోని ఆంద్రరత్నభవన్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లీడర్లు భేటీ అయ్యారు. 

మోదీ టూర్‌పై కాంగ్రెస్ మండిపాటు..

ఏపీ పర్యటకు ఏ మొహం పెట్టుకొని మోదీ వస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని, నిధులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన ఏమీ చేయలేదని ఆరోపించారు. రాజదాని అమరావతి శంకుస్థాప సమయంలో నీరు, మట్టి తెచ్చి మాటలు చెప్పిన మోదీ ఆ తరువాత ఎందుకు తన మాటలను అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. విభజన తరువాత టీడీపీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడ మోదీ ఏపీకి చాలా సార్లు వచ్చారని అప్పుడు కూడా ఏం చేయలేదన్నారు. ఏపీని గుజరాత్ తరహాలో ముందుకు నడిపిస్తామని మోదీ మాటలు చెప్పి తప్పించుకున్నారని ఆరోపించారు. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. 

అప్పట్లో టీడీపీతో జతకట్టిన బీజేపి నేతలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో అనేక హామీలు ఇచ్చారన్నారు. నేడు ఏపీకి రాజధాని కూడా ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో గందరగోళంగా ఉందన్నారు. ఈ పరిస్థితులకు బీజేపీ, మోదీ నాయకత్వంలోని మోదీయే కారణమని మండిపడుతున్నారు. 

అందుకే మోదీ విశాఖ పర్యటన సందర్భంగా వివిధ స్థాయిల్లో నిరసనలు తెలిపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నల్లజెండాలు, రిబ్బన్లు ప్రదర్శించటంతోపాటుగా బ్యానర్లు, ప్లకార్డులు చూపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర శైలి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ఇదే వేదికపై చర్చించారు నేతలు. రాష్ట్రానికి బీజేపి చేసిన మోసం, జగన్, బీజేపి కలసి ఆడుతున్న నాటకాలపై ప్రజలకు అంశాల వారీగా వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నాయకులంతా గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకొని నిరసనలను తెలపాలని  సూచించారు. 

గన్నవరంలో నల్లబెలూన్లు ఎగరేసిన కాంగ్రెస్ 

కాంగ్రెస్ పార్టీ నేతలు మోదీ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున ఆందోళనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అవ్వాల్సి వచ్చింది. ఇటీవల మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ నిరసనలు తెలిపింది. గన్నవరం విమనాశ్రయం వద్ద నల్లబెలూన్లు ఎగర వేసి సంగతి అందరికీ తెలిసందే గాల్లోకి ఎగిరిన నల్లబెలూన్లు మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు దగ్గరలో వెళ్లాయి. దీనిపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. పోలీసులు వైఫల్యంపై బీజేపి నేతలు మండిపడ్డారు. నల్లబెలూన్ల సంఘటనపై కేంద్ర పార్టీకి కూడా ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు విచారణ చేసి, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

రాహుల్ జోడో యాత్ర స్పూర్తితో...

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఏపీలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఇదే స్ఫూర్తితో పాదయాత్ర చేయాలని నేతలు నిర్ణయించారు. డిసెంబరు మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల కవర్ చేసేలా పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు శైలజానాథ్. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నిరంతరం పని చేస్తామని రాబోయే రోజుల్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించి, క్యాడర్‌కు దగ్గర అయ్యేందుకు అవసరమైన అన్ని మార్గాల్లో పని చేస్తామని వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Government Approved EV Chargers: దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! భారీ నిధుల విడుదల!
Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Best Alternative To Gold: బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
Kalyana Lakshmi Scheme In AP Online Apply: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
Karuppu Collections: సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
Embed widget