అన్వేషించండి

Vijayawada: వరద బాధితులకు ఆహార పంపిణీలో రికార్డు! 3 టన్నుల ఆహారం పంపిణీ - ఏపీ సీఎంఓ

Floods in Vijayawada: విజయవాడ నగరంలో ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకూ రికార్డ్ స్థాయిలో దాదాపు 3 టన్నులకు పైగా ఆహార పదార్ధాలు అందజేశామని ఏపీ సీఎం కార్యాలయం వెల్లడించింది.

Vijayawada Rains Today: విజయవాడలో వరద బాధితులుగా ఉన్న వేల మంది ప్రజలు ఆకలితో, దాహంతో అల్లాడుతుండగా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరద ప్రాంతాలలో బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయిన ఎంతో మంది ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను అందచేస్తున్నారు. ఇలా విజయవాడ నగరంలో ఇప్పటి వరకూ రికార్డ్ స్థాయిలో దాదాపు 3 టన్నులకు పైగా ఆహార పదార్ధాలు అందజేయడం జరిగిందని ఏపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఎన్డీఆర్ఎస్ బృందాలు ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు అందచేశాయని ప్రకటించింది. మరో రెండు హెలికాఫ్టర్లు కూడా సహాయ చర్యలు ప్రారంభిస్తాయని వెల్లడించింది.

డ్రోన్ల ద్వారా ఆహారం
విజయవాడలో రోడ్లన్నీ జలమయం కావడంతో పడవలు, మర బూట్ల ద్వారానే ప్రస్తుతానికి రవాణా సాధ్యం అవుతోంది. నీటి మట్టం కాస్త తక్కువ ఉన్న చోట్ల జేసీబీలు, పొక్లెయినర్లను వాడుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని, తాగు నీటిని అందిస్తున్నారు. అయితే, సహాయ బృందాలు ఇంకా చేరుకోలేని వరద ప్రాంతాలలో డ్రోన్ ల ద్వారా ప్రజలకు ఆహారం, మంచి నీటిని అందించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం డ్రోన్ లను రెడీ చేసింది. వాటి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సులభంగా ఆహారాన్ని రవాణా చేయగలుగుతున్నారు.

చంద్రబాబు పర్యటన
విజయవాడలోని కృష్ణలంక, రాజరాజేశ్వరీపేట ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి పర్యటించారు. అక్కడి వర్ష బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నీటి మట్టాన్ని మరోసారి పరిశీలించారు. ఇటు విజయవాడలోని భవానీపురం సితారా సెంటర్ లో కూడా చంద్రబాబు నాయుడు పొక్లెయినర్ ఎక్కి పర్యటించారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీటికి కొట్టుకువచ్చిన పడవలు ఢీ కొట్టడంతో బ్యారేజ్ గేట్లకు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి మరమ్మతులకు ఆదేశించారు.

వరద బాధితులకు వెయ్యి సోలార్ లాంతర్లు
రాష్ట్ర ఇంధన శాఖ సేకరించిన వెయ్యి సౌరశక్తి లాంతర్లను చంద్రబాబు పరిశీలించారు. వాటిని వార్డు కార్యదర్శులకు అందచేసి విజయవాడలో వరద ముంపు వల్ల విద్యుత్ సౌకర్యం లేని వారికి అందచేయాలని ఆదేశించారు. మరో 4 వేల సౌరశక్తి లాంతర్లను సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ ఎం. కమలాకరబాబు పాల్గొన్నారు.

చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లూథియానా నుంచి సైనిక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వారిని ప్రత్యేక బస్సుల్లో ముంపు ప్రాంతాలకు తీసుకువచ్చి రంగంలోకి దింపారు.

అక్కాచెల్లెళ్ల విరాళం
మరోవైపు, భారీ వర్ష బాధితులకు విరాళంగా విజయవాడకు చెందిన విజయలక్ష్మీ, నిర్మలాదేవి, రాణి అనే ముగ్గురు అక్కాచెళ్లెళ్లు ఒక్కొక్కరు రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నేడు అందచేశారు. వారి దాతృత్వానికి సీఎం అభినందనలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్Telangana High court on Hydra | తెలంగాణలో హాట్ టాపిక్ 'హైడ్రా' పై హైకోర్టు దృష్టి | ABP DesamSarpanch Unanimous Election | సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Renu Desai: దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
Vijayawada floods: వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Crime News: తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
YSRCP : వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
Embed widget