అన్వేషించండి

Gade Sai Krishna Vijayawada Missing Case: గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసు - బాధితుడి తల్లికి సీఎం చంద్రబాబు హామీ.. సీఐపై మర్డర్ కేసు నమోదు!

Krishnalanka : విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఎం చంద్రబాబును కలిశారు తల్లి విజయలక్ష్మి. కస్టడీ డెత్ ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదు చేశారు.

CM Chandrababu Naidu Meets Vijayalakshmi:  విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు గాదె సాయి కృష్ణ అదృశ్యం , లాకప్ డెత్ ఆరోపణల ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రిని వేడుకున్నారు. 

 సీఎంను కలిసిన బాధితుడి తల్లి – నిష్పక్షపాత విచారణకు హామీ 

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ గత నెల రోజులుగా అదృశ్యమవగా, అతని తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబు నాయుడును కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆమె సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులెంతటి వారైనా వదిలిపెట్టబోమని చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్పందన పట్ల విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని మీడియాకు తెలిపారు.

 అసలేం జరిగింది? – కస్టడీ డెత్ ఆరోపణలు 

పోలీసు రికార్డుల ప్రకారం గాదె సాయి కృష్ణపై   క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు  అతను ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటున్నాడు. మే 9, 2026 న కృష్ణలంక పోలీసులు మార్కాపురం వెళ్లి సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదు, పోలీసు స్టేషన్ లోనూ చూపించలేదు. అప్పటి కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్   జి. నాగరాజు ఆధ్వర్యంలో సాయి కృష్ణను స్టేషన్‌లో దారుణంగా కొట్టి చంపేసి, సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాన్ని తగలబెట్టేశారని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు.

  సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశం 

పోలీసులు తమ కుమారుడిని కోర్టులో ప్రవేశపెట్టడం లేదంటూ విజయలక్ష్మి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. జూన్ 29 లోగా సాయి కృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. మరోవైపు విజయవాడ స్థానిక కోర్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని మే 1 నుండి జూన్ 1 వరకు ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్  లు ,  సర్వర్లను వెంటనే సీజ్ చేసి భద్రపరచాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.   

  సీఐపై మర్డర్  కేసు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే ఈ కేసును నిష్పక్షపాతంగా తేల్చేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, సీనియర్ ఐపీఎస్ అధికారి డి. నరసింహ కిషోర్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సస్పెండైన సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత  కింద అక్రమ నిర్బంధం, హత్య , సాక్ష్యాల విధ్వంసం కింద హత్యానేరం కేసు నమోదు చేశారు.

 రాజకీయ రంగు పులుముకున్న ఉదంతం 

ఈ లాకప్ డెత్ ఆరోపణల ఉదంతం ఏపీలో రాజకీయంగానూ వేడి పుట్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసానికి వెళ్లి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం దారుణమని, కేవలం ఒక సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదని, దీనిపై సీబీఐ ( విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ విచారణను వేగవంతం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget