అన్వేషించండి

CI Nagaraju Suspension: సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు.. నేడు విజయవాడకు ఎస్పీ నరసింహ కిశోర్

మిస్సింగ్ యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై పలు బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బాధితుడి తల్లి ఫిర్యాదుతో సస్పెండైన సీఐ నాగరాజుపై క్రిమినల్ కేసు.
  • సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది.
  • ఎస్పీ నరసింహ కిశోర్ ఈరోజు విజయవాడ చేరుకొని దర్యాప్తు వేగవంతం చేస్తారు.
  • మాజీ సీఎం జగన్ కుటుంబ పరామర్శ, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

Gade Sai Krishna Missing Issue | విజయవాడ: తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుడైన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండైన సీఐ నాగరాజుపై 127 (4), 127(6), 103(1), 238 బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసు విచారణాధికారిగా ప్రభుత్వం నియమించిన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ నేడు (జూన్ 19న) విజయవాడకు చేరుకోనున్నారు. నగరంలో అడుగుపెట్టిన వెంటనే ఆయన ఈ కేసు తీవ్రతపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.


CI Nagaraju Suspension: సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు.. నేడు విజయవాడకు ఎస్పీ నరసింహ కిశోర్

విజయవాడ పర్యటనలో భాగంగా ఎస్పీ నరసింహ కిశోర్ తొలుత రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబులను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక వివరాలు, ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలపై వారితో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన అనంతరం, ఎస్పీ నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేయనున్నారు. 

రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్..

సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు ఏపీ ప్రభుత్వం పవర్ ఫుల్ ఆఫీసర్‌ను రంగంలోకి దింపింది. రాజమండ్రి  ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ కిషోర్ వంటి అధికారికి బాధ్యతలు అప్పగించడం కేసు సీరియస్ నెస్‌ను తెలుపుతుంది. పోలీసులు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదనే ప్రభుత్వం ఆయనను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. 

ఈ కేసులో ప్రధానంగా వినిస్తున్న ఆరోపణ ఏంటంటే.. సాయికృష్ణను విచారణ పేరుతో కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే అతడు మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయం చేశారని ఆరోపణలున్నాయి. ఎస్పీ నరసింహా కిషోర్‌ శుక్రవారం నేరుగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడ లాగ్ బుక్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఆయన విచారించనుండటంపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సస్పెన్షన్ వేటు పడిన సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నిప్పులు చెరుగుతూ.. సాయికృష్ణను పోలీసులే చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు.

ఈ దారుణంలో కృష్ణలంక సీఐతో పాటు విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ఆక్షేపిస్తూ, దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మే నెలలో పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను జగన్ గుర్తుచేశారు. ఆ తర్వాతే మే 9న సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, గోళ్లు పీకి చంపేశారని ధ్వజమెత్తారు. కొడుకు కోసం వచ్చిన తల్లిని సీఐ హేళన చేశారని, డీజీపీ కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని జగన్ తీవ్రంగా విమర్శించారు.

Frequently Asked Questions

సాయి కృష్ణ అదృశ్యం కేసులో సస్పెండైన సీఐపై ఏ చర్యలు తీసుకున్నారు?

సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు 127(4), 127(6) సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ఎవరు బాధ్యత వహిస్తారు?

ఈ కేసు విచారణకు రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన జూన్ 19న విజయవాడకు చేరుకుని ఉన్నతాధికారులతో సమీక్షించి విచారణ వేగవంతం చేస్తారు.

సాయికృష్ణ కేసుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమన్నారు?

వైఎస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, సాయికృష్ణను పోలీసులే చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget