అన్వేషించండి

Gade Saikrishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!

Gade Saikrishna Missing Case: సంచలనంగా మారిన విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు మరో మలుపు తిరిగంది. ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీని ప్రభుత్వం నియమించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయవాడలో సాయికృష్ణ అదృశ్యంపై పోలీసులపై హత్య ఆరోపణలు.
  • కేసు విచారణకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నియామకం.
  • ఎస్పీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ, సిబ్బందిని విచారిస్తారు.
  • సాయికృష్ణ తల్లి సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.

Gade Saikrishna Missing Case: విజయవాడ నగరంలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ . అసలు సాయికృష్ణ ఎక్కడ? గడప దాటిన సాయికృష్ణ ఏమయ్యాడు. కృష్ణలంక పోలీస్‌లు చంపేశారనే ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. " నా కొడుకు బతికున్నాడో లేదో చెప్పండి అని సాయికృష్ణ తల్లి వేస్తున్న ఆర్తనాదాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్‌ని రంగంలోకి దించింది. 

ఈ కేసులో అసలు ఏం జరిగింది? పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? రాజమండ్రి  ఎస్పీ నరసింహ కిషోర్ రాకతో ఈ ఇన్వెస్టిగేషన్ ఏ మలుపు తిరుగబోతోందో చూద్దాం. 

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రాజమండ్రి ఎస్పీ!

విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ కిషోర్ వంటి సమర్థవంతమైన అధికారికి బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూదనే క్లియర్ మెసేజ్‌ని ప్రభుత్వం పంపినట్టు కనిపిస్తోంది. 

కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌పై లాకప్ డెత్ మరక 

ఈ కేసులో ప్రధానంగా వినిస్తున్న ఆరోపణ కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన దారుణం గురించి, సాయికృష్ణను విచారణ పేరుతో తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే సాయి మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు నేరుగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నా ఎస్పీ నరసింహా కిషోర్‌, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్, లాగ్ బుక్స్, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారించనున్నారు. 

బూడిదైనా ఇప్పించండని తల్లి ఆవేదన 

ఏ తల్లికైనా తన బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోవడం సహజం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లిన తర్వాత మళ్లీ కంటికి కనిపించలేదని అతను బతికున్నాడో లేదో కూడా పోలీసులు చెప్పడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. సాయికృష్ణ బతికున్నాడో లేదో కనీసం సమాచారం ఇవ్వాలని, చంపేసి ఉంటే బూడిదైనా ఇవ్వాలని ఆమె వేడుకుంటున్నారు. 

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ 

స్థానిక పోలీసుల విచారణపై సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంటున్నారు. అందుకే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే నిందితులుగా ఉన్నప్పుడు మరో పోలీస్ అధికారి చేసే విచారణ ఎంత వరకు నిష్పక్షపాతంగా ఉంటుందనేది వారి ప్రశ్న. హైకోర్టు పర్యవేక్షణలో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Frequently Asked Questions

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటి?

కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టడం వల్లే అతను మరణించాడని, ఆపై పోలీసులు మృతదేహాన్ని మాయం చేశారని ప్రధాన ఆరోపణ. ఇది లాకప్ డెత్ ఆరోపణలకు దారితీసింది.

సాయికృష్ణ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఎవరిని నియమించింది?

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఇది పోలీసు వర్గాలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది.

సాయికృష్ణ కుటుంబ సభ్యులు ప్రభుత్వం నుండి ఏమి డిమాండ్ చేస్తున్నారు?

సాయికృష్ణ తల్లి తన కొడుకు బతికున్నాడో లేదో తెలియజేయాలని, ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం బూడిదైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులపై నమ్మకం లేక సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget