అన్వేషించండి

Vijayanagaram Train Accident: రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి - ఇతర మృతుల వివరాలివే!

Vijayanagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 9 మందిని అధికారులు గుర్తించారు. ఇద్దరు లోకోపైలట్లు సహా, ఓ గార్డు మృతి చెందినట్లు తెలిపారు.

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. 

ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి

ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 13 మృతదేహాలను వెలికితీయగా, వారిలో విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోని ఇద్దరు లోకో పైలట్లు, పలాస ప్యాసింజర్ గార్డు ఎంఎస్ రావు కూడా ఉన్నారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సహాయక చర్యల్లో ద.మ.రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే, ఇతర విభాగాల సిబ్బంది వెయ్యి మందికి పైగా పాల్గొంటున్నారు. దెబ్బతిన్న ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను అక్కడి నుంచి క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు. 

గుర్తించిన మృతుల వివరాలు

ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

  • గిరిజాల లక్ష్మి (35), ఎస్.పి.రామచంద్రాపురం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా
  • కంచు భారతి రవి (30), జోడుకొమ్ము గ్రామం, జామి మం. విజయనగరం జిల్లా
  • చల్లా సతీశ్ (32), తండ్రి పేరు చిరంజీవ రావు (లేట్), ప్రదీప్ నగర్, విజయనగరం
  • ఎస్.హెచ్.ఎస్.రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, ఉత్తరప్రదేశ్
  • కరణం అక్కలనాయుడు (45), తండ్రి పేరు చిన్నయ్య, కాపుసంబాం గ్రామం, గరివిడి మం. విజయనగరం
  • ఎం.శ్రీనివాస్, విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు
  • చింతల కృష్ణమనాయుడు, దెందేరు గ్రామం, కొత్తవలస మం. విజయనగరం
  • రెడ్డి సీతమనాయుడు (43), రెడ్డిపేట గ్రామం, చీపురుపల్లి మం. విజయనగరం
  • మజ్జ రాము (30), గదబవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం.

'ఘటనా స్థలానికి రావొద్దు'

మరోవైపు, ప్రమాద స్థలానికి బయటి వారు రావొద్దని రైల్వే అధికారులు కోరుతున్నారు. కొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారని దీని వల్ల టెక్నికల్ సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. 'అందరికీ విన్నపం. ఇది చాలా సున్నితమైన, విషాద సంఘటన అని మాకు తెలుసు. మా సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. దయచేసి రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతంలోకి ప్రవేశించవద్దు. అలా వస్తే పనులు, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకుని రైల్వే అధికారులు, సిబ్బందికి సహకరించగలరు.' అంటూ అధికారులు కోరారు. 

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ

అటు, ప్రమాదం స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన రైల్వే సిబ్బంది నిర్వహిస్తున్నారు. బోగీలు నుజ్జు నుజ్జు కావడంతో విశాఖ నుంచి బాహుబలి క్రేన్ తెచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి సారించారు. పలాస ప్యాసింజర్ లోని 11 బోగీలు అలమండ స్టేషన్ కు, రాయగడ ప్యాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్ కు తరలించారు. సహాయక చర్యలు సాగుతుండగా, ఘటనా స్థలి వద్ద 2 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. స్థానికులు అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.

 

Also Read: విజయనగరంలో రైలు ప్రమాదంతో ఈ ట్రైన్స్ రద్దు- మరికొన్ని దారి మళ్లింపు 

టాప్ హెడ్ లైన్స్

KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
ABP Conclave 2026 : భద్రతపై రాజీ లేదు - తుది దశకు ఎయిర్ ఇండియా ప్రమాద దర్యాప్తు - ఏబీపీ కాన్క్లేవ్‌లో మంత్రి రామ్మోహన్ నాయుడు !
భద్రతపై రాజీ లేదు - తుది దశకు ఎయిర్ ఇండియా ప్రమాద దర్యాప్తు - ఏబీపీ కాన్క్లేవ్‌లో మంత్రి రామ్మోహన్ నాయుడు !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget