అన్వేషించండి

Vijayanagaram Train Accident: రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి - ఇతర మృతుల వివరాలివే!

Vijayanagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 9 మందిని అధికారులు గుర్తించారు. ఇద్దరు లోకోపైలట్లు సహా, ఓ గార్డు మృతి చెందినట్లు తెలిపారు.

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. 

ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి

ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 13 మృతదేహాలను వెలికితీయగా, వారిలో విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోని ఇద్దరు లోకో పైలట్లు, పలాస ప్యాసింజర్ గార్డు ఎంఎస్ రావు కూడా ఉన్నారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సహాయక చర్యల్లో ద.మ.రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే, ఇతర విభాగాల సిబ్బంది వెయ్యి మందికి పైగా పాల్గొంటున్నారు. దెబ్బతిన్న ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను అక్కడి నుంచి క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు. 

గుర్తించిన మృతుల వివరాలు

ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

  • గిరిజాల లక్ష్మి (35), ఎస్.పి.రామచంద్రాపురం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా
  • కంచు భారతి రవి (30), జోడుకొమ్ము గ్రామం, జామి మం. విజయనగరం జిల్లా
  • చల్లా సతీశ్ (32), తండ్రి పేరు చిరంజీవ రావు (లేట్), ప్రదీప్ నగర్, విజయనగరం
  • ఎస్.హెచ్.ఎస్.రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, ఉత్తరప్రదేశ్
  • కరణం అక్కలనాయుడు (45), తండ్రి పేరు చిన్నయ్య, కాపుసంబాం గ్రామం, గరివిడి మం. విజయనగరం
  • ఎం.శ్రీనివాస్, విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు
  • చింతల కృష్ణమనాయుడు, దెందేరు గ్రామం, కొత్తవలస మం. విజయనగరం
  • రెడ్డి సీతమనాయుడు (43), రెడ్డిపేట గ్రామం, చీపురుపల్లి మం. విజయనగరం
  • మజ్జ రాము (30), గదబవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం.

'ఘటనా స్థలానికి రావొద్దు'

మరోవైపు, ప్రమాద స్థలానికి బయటి వారు రావొద్దని రైల్వే అధికారులు కోరుతున్నారు. కొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారని దీని వల్ల టెక్నికల్ సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. 'అందరికీ విన్నపం. ఇది చాలా సున్నితమైన, విషాద సంఘటన అని మాకు తెలుసు. మా సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. దయచేసి రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతంలోకి ప్రవేశించవద్దు. అలా వస్తే పనులు, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకుని రైల్వే అధికారులు, సిబ్బందికి సహకరించగలరు.' అంటూ అధికారులు కోరారు. 

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ

అటు, ప్రమాదం స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన రైల్వే సిబ్బంది నిర్వహిస్తున్నారు. బోగీలు నుజ్జు నుజ్జు కావడంతో విశాఖ నుంచి బాహుబలి క్రేన్ తెచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి సారించారు. పలాస ప్యాసింజర్ లోని 11 బోగీలు అలమండ స్టేషన్ కు, రాయగడ ప్యాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్ కు తరలించారు. సహాయక చర్యలు సాగుతుండగా, ఘటనా స్థలి వద్ద 2 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. స్థానికులు అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.

 

Also Read: విజయనగరంలో రైలు ప్రమాదంతో ఈ ట్రైన్స్ రద్దు- మరికొన్ని దారి మళ్లింపు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget