అన్వేషించండి

Andhra News : ఈవో వేధింపులతో పూజారుల విధుల బహిష్కరణ - స్వామి వారికీ పూజల్లేవు ! ఎక్కడంటే ?

కోటప్పకొండపై త్రికోటేశ్వరస్వామికి పూజాధికాలు నిలిచిపోయాయి. కారణం ఏమిటంటే ?


 
Andhra News :    పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపిపై ఆలయ పూజారులు, సిబ్బంది తిరుగుబాటు  బావుటా ఎగరేశారు. స్వామివారికి సమర్పించ వలసిన  నిత్య కైంకర్యాలకు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.  భక్తుల ఎదుటే పూజారులను, సిబ్బందిని గౌరవం లేకుండా తీవ్రమైన పరుష పదజాలంతో దుర్భాషలా డుతున్నారని,తమ మనోభావాలు దెబ్బతినేల కించపరుస్తున్నారని,ఓ లేఖపై రాసి EO గోపీకి అందచేసి వెళ్లిపోయారు.మే 4వ తేదీ నుంచి పూర్తిగా కొండ పైనా క్రింద స్వామివారికి నిత్య కైంకర్యాలు, విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు.                                                                 

అదే విధంగా స్వామి వారి కైంకర్యాలకు స్వామివారి ఆభరాణాలకు, భక్తులు అందించే కానుకులకు  భద్రత లేకుండా పోవడంతో తమ మనసులో అశాంతి నెలకొని అభద్రత భావంతో ఉన్నామని పూజారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆగమ సాంప్రదాయానికి విరుద్ధంగా తమ చేత స్వామి కార్యక్రమాల విషయంలో భయపెట్టి బెదిరించి కార్యక్రమాలు నిర్వహించేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ తిరుగుబాటులో ఆలయ ప్రధాన అర్చకులు కొండ కావూరి అప్పయ్య గురుకుల్, పూజారులు రంగవద్ద్యుల కిరణ్ కిషోర్ శర్మ, ఫణింద్ర దుర్గ, రామకృష్ణ వేద వ్యాస్, కే సత్యం, కెవి సుబ్రహ్మణ్యం, అలానే ఆలయ సిబ్బంది కొండయ్య, నాగిరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు విధులు బహిష్కరిస్తున్నట్లు లేఖలో  పేర్కొన్నారు.                                                                                                     

ర్చకుల ఆరోపణలను ఆలయ ఇఒ వేమూరి గోపి ఖండించారు. అర్చకులతో తాను అనుచితంగా ప్రవర్తించలేదని, దుర్భాషలాడలేదని తెలిపారు. నిబంధనల మేరకు పని చేయాలని మాత్రమే ఆదేశించానని చెప్పారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు డిప్యూటీ ఇఒ చంద్రశేఖర్‌రెడ్డి చర్చిస్తున్నారని, యాత్రికుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఓ వైపు ఈవో మరో వైపు అర్చకులు పట్టిన పట్టు విడువకపోవడంతో కోటప్పకొండలో కైంకర్యాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                             

నర్సరావుపేటలో కోటప్పకొండపై ఉన్న త్రికోటేశ్వరస్వామి వారి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా గుర్తింపు పొందింది. పెద్ద  సంఖ్యలో భక్తులు ప్రతీ రోజూ  వస్తూంటారు. అయితే ఈవోకు.. అర్చకులకు ఈ మధ్య కాలంలో ఏర్పడిన వివాదాలతో సమస్యలు ప్రారంభమయ్యాయి.  ఎవరూ తగ్గకపోవడంతో పూజాధికాలకూ సమస్యలు ఏర్పడ్డాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
AI Generated Videos : AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
Embed widget