అన్వేషించండి

Top Headlines: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - తెలంగాణలో కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top News In Ap And Telangana:

1. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఉద్యోగ ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఆకలితో ఇబ్బంది పడకూడదని తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు ప్రజల్లో చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు పట్టణాలు, ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ క్యాంటీన్లను ఇకపై గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది. 2024-25 సంవత్సరానికి ఐదు నెలల కాలం కోసం బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఆహారాన్ని అందించేందుకు 123 ప్రాంతాల పరిధిలో 204 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావు కేశవ్ తెలిపారు. ఇంకా చదవండి.

2. ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,94,427.25కోట్లతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఇంకా చదవండి.

3. జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్

తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న మాజీ సీఎం జగన్‌పై (Jagan) ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని మండిపడ్డారు. 'అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది.?. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది.?.' అని మండిపడ్డారు. ఇంకా చదవండి.

4. వికారాబాద్‌లో కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి

వికారాబాద్ జిల్లాలో (Vikarabad District) సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు తిరగబడ్డారు. వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై (Prteek Jain) చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దుద్యాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును అక్కడి రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చదవండి.

5. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు తెలిపారు. హుజూరాబాద్ (Huzurabad) సమీపంలోని సింగాపూరం సమీపంలో యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో యువతి లారీ కింద ఇరుక్కోగా స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని ఆపాడు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget