అన్వేషించండి

AP News Developments Today: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

విశాఖలో నిన్న మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావుకి నివాళి అర్పించడం కోసం విశాఖపట్నానికి గవర్నర్ లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు రానున్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.. ముందుగా స్వామి వారికి నిర్వహించే ప్రాత:కాల ఆరాధనలు పూర్తైన తర్వాత అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించింది టిటిడి.. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు..

ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో 300, ఆఫ్‌లైన్‌లో టోకెన్లు పొందారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్దేశిత టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామిని తిరుమల శ్రీవారిని ఎస్వీ బట్ కేరళ హై కోర్టు నాయమూర్తి, ఏపీ హై కోర్టు నాయమూర్తి రవేంద్ర బాబు, ఏపీ హై కోర్టు నాయమూర్తి రావినాథ్ తిలహరి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, ఏపీ హై కోర్టు నాయమూర్తి రాజశేఖర్ రావు,‌ తెలంగాణ హై కోర్టు సూర్యపల్లి నంద, ఏపీ హై కోర్టు నాయమూర్తి గంగారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి,కర్ణాటక హై కోర్టు దినేష్ కుమార్, ఎమ్మెల్యే అంబంటి రాంబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, గవర్నమెంట్ చీఫ్ విప్  ప్రసాద్ రాజు, మినిష్టర్ ఉషశ్రీ చరణ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ హై కోర్టు ev వేణుగోపాల్, తేవర్చంగ్ గలట్ కర్ణాటక గవర్నర్, మినిస్టర్ మెరుగు నాగార్జున, తమిళనాడు సీజే టి రాజా, గుడివాడ అమర్నాథ్ మినిస్టర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మినిష్టర్ విశ్వరూప్, ఏపీ మినిస్టర్ జయరాం, కోళ్లు రవేంద్ర టీడీపి మాజీ మంత్రి, కోన  రఘుపతి, ఎమ్మెల్యే రఘునందన్,కడియం శ్రీహరి, దేవి గౌడ కుమారుడు రేవన్న, ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మినిస్టర్ కరుమూరి వెంకట నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్, తెలంగాణ బిజెపి నాయకుడు కే లక్ష్మణ్, యాక్టర్ రాజేంద్రప్రసాద్, అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే, వెల్లంపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యే, ప్రకాశ్ జవదేకర్ ఎంపీ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా వైకుంఠ ద్వార గుండా స్వామి వారి‌ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.

అనంతరం‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో అదే అభివృద్ధి కొనసాగాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తాడుకుంటున్నారని వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థించామన్నారు.. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పుష్కరాల సమయంలో 30 మంది ప్రాణాలు పోగొట్టారని అదేవిధంగా ఇప్పుడు కూడా సామాన్య ప్రజల ప్రాణాలు ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసులు తెలిపారు.. టీడీపీ మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో అయినా ప్రభుత్వం మారి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమర్నాథ్ రెడ్డి, ఉషశ్రీ, జయరాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, నిమ్మకాయ చిన్నరాజప్ప, టిడిపి మాజీ మంత్రి తదితరులు ఉన్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం పిలుపు
ఈ సాయంత్రం 5 గంటలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ ను ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ భేటీలో జిల్లా ఇంచార్జి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ఇటీవల వరుసగా ప్రభుత్వ అధికారుల పని తీరుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం నుండి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాయంత్రం 4.30 లకు సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకోనున్నారు.

విశాఖలో నిన్న మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావుకి నివాళి అర్పించడం కోసం విశాఖపట్నానికి గవర్నర్ లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు రానున్నారు. అనంతరం అంతిమ యాత్ర జరగనుంది.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియామకం కానున్న తోట చంద్ర శేఖర్. నేడు హైదరాబాద్ లో BRS లో చేరిక

రాజకీయ దుమారం సృష్టించనున్న ఉయ్యూరు తొక్కిసలాట
ఉయ్యూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాజకీయంగా  దుమారం లేపుతోంది. మృతులకు 20 లక్షల పరిహారం ఇస్తామని కార్యక్రమ నిర్వహకులు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు వెళ్లిపోయాకే ఈ ఘటన జరిగినట్టు వారు చెబుతున్నారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Anupama Parameswaran Tillu Square Song Launch: అనుపమ మాట్లాడుతుంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు..!Keeravani Oscars RRR : అవార్డు అందుకోవడానికి కీరవాణి ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసా..?Nuvvalarevu Weird Marriage: నువ్వలరేవు... రెండేళ్లకోసారి మాత్రమే పెళ్లిళ్లు చేసే వింత గ్రామంRajamouli RRR Jr NTR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సీన్స్ గురించి జపాన్ లో సంచలన విషయాలు వెల్లడించిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Family Star OTT: 'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!
'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Embed widget