అన్వేషించండి

టీడీపీ పాలనలో పులివెందులకు నీళ్లు- జగన్ హయాంలో కుప్పానికి జలాలు- ఇదే స్ఫూర్తి రాష్ట్రమంతటా ఉంటే..

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే...ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇచ్చారు. 

Kuppam Vs Pulivendula Development : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohah Reddy) రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలను జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. రిపోర్టులు సరిగా లేకపోతే టికెట్ లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. అందులో భాగంగానే వైనాట్ 175 (Why Not 175) నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యమని జగన్మోహన్ పదే పదే చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu) సైతం వైనాట్ పులివెందుల అంటూ ప్రచారం దూసుకెళ్తున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబునాయుడు శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతున్నారు. గెలుపు తమదంటే తమది ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

వైనాట్ కుప్పం టార్గెట్ గా జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...వైనాట్ కుప్పం అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంకు నీళ్లు ఇచ్చారు. చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ...సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. సొంత నియోజకవర్గానికి ఏమైన చేస్తే ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తాయని భావించారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్... కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చి... ఆ తర్వాత కుప్పం మండలాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు.

సొంత నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేయలేకపోయారని...తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని డెవలప్ మెంట్ లో పరుగులు పెట్టించామని జగన్ చెప్పుకుంటున్నారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయడం కోసం భారీగా నిధులు కేటయించారు. నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ కు అప్పగించారు జగన్. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు.  అందుకే సీఎం జగన్...వైనాట్ కుప్పం అని అంటున్నారు. 

పులివెందులకు నీళ్లిచ్చింది తామేనన్న చంద్రబాబు
2014లో మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు...కొత్త రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. కరవు జిల్లా అయిన అనంతపురంకు కృష్ణ జలాలను తరలించారు. రాయలసీమకు మొట్టమొదటిసారిగా నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అని... గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్వింది ఎన్టీ రామారావేనని చంద్రబాబు గుర్తుచేశారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీల నీటిని సీమకు మళ్లించారమన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... వచ్చే ఎన్నికల్లో పులివెందులలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ వైనాట్ కుప్పం అంటుంటే...పులివెందులకు న్యాయం చేసింది...నీళ్లు ఇచ్చింది తామేనంటూ చంద్రబాబు నాయుడు బల్లగుద్ది చెబుతున్నారు. 

ఇద్దరు నేతల పట్టింపులతో ప్రజలకు మంచి
ఇద్దరు నేతల పట్టింపులు...పులివెందుల, కుప్పం ప్రజలకు మంచి చేసిందనే చెప్పుకోవాలి. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పులివెందులకు నీళ్లించారు. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కుప్పంకు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు. ఒకరి నియోజకవర్గంపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు డెవలప్ మెంట్ చేస్తున్నా....అల్టిమేట్ గా ప్రజలు మాత్రం లబ్దిపొందారు. రెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచినా...అగ్రనేతల ఛాలెంజ్ లతో సాగునీరు అందించినా...ప్రజలకు మాత్రం పోటాపోటీగా మంచి పనులు చేసి పెట్టారు. ఇదే స్ఫూర్తి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget