అన్వేషించండి

TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి

Tirumala: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖలకు అనుమతి ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 24 నుంచి అనుమతించనున్నారు.

TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించడం లేదని నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు టీటీడీ పరష్కారం చూపింది. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తుంది. వారి సిఫారసుపై దర్శన టిక్కెట్లను కేటాయిస్తుంది. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇస్తారు. ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పిస్తారు.

ఇటీవల తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదన్నారు. కొండా సురేఖ చంద్రబాబుకు లేఖ రాశారు. రఘునందన్ రావు తిరుమలలో  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లేఖలను అనుమతిస్తూ ఉత్తర్వాలు జారీ చేశారు.   

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుకోవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు.   టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ  బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.                            

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఓ లేఖను చంద్రబాబుకు రాశారు.  రేవంత్ లేఖకు స్పందించిన చంద్రబాబు  గత ఏడాది డిసెంబర్ లో    తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు  అంగీకరించారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల  వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. .                           

శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని  తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేఖలకు అనుమతిస్తాన్నారు. అయితే ఇప్పటి వరకూ అమలులోకి రాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. వారి అనుచరులు సిఫారసు లేఖలు అడుగుతూండటంతో..  టీటీడీపై తెలంగాణ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలి - పార్టీ వర్క్ షాప్‌లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలి - పార్టీ వర్క్ షాప్‌లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara 2026: AP, తెలంగాణ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ రూట్ మ్యాప్ ఫాలో అవండి
AP, తెలంగాణ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ రూట్ మ్యాప్ ఫాలో అవండి
Amaravati Farmers Plot Allotment: అమరావతి రైతుల‌కు గుడ్‌న్యూస్.. మలి విడత ప్లాట్ల కేటాయింపుపై CRDA కీలక ప్రకటన
అమరావతి రైతుల‌కు గుడ్‌న్యూస్.. మలి విడత ప్లాట్ల కేటాయింపుపై CRDA కీలక ప్రకటన
Anasuya Bharadwaj : అనసూయకు గుడి కడతానన్న ఫ్యాన్! - నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
అనసూయకు గుడి కడతానన్న ఫ్యాన్! - నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

వీడియోలు

Sunil Gavaskar About T20 World Cup | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు
Washington Sunder Fitness Update | వాషింగ్టన్ సుందర్ ఫిట్ నెస్ అప్డేట్
Tilak Varma in T20 World Cup | వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అందుబాటులో తిలక్ వర్మ ?
Nat Sciver Brunt Century WPL 2026 | మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ!
RANABAALI Decode | Vijay Deverakonda Rashmika తో Rahul Sankrityan పీరియాడికల్ డ్రామా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలి - పార్టీ వర్క్ షాప్‌లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలి - పార్టీ వర్క్ షాప్‌లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara 2026: AP, తెలంగాణ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ రూట్ మ్యాప్ ఫాలో అవండి
AP, తెలంగాణ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ రూట్ మ్యాప్ ఫాలో అవండి
Amaravati Farmers Plot Allotment: అమరావతి రైతుల‌కు గుడ్‌న్యూస్.. మలి విడత ప్లాట్ల కేటాయింపుపై CRDA కీలక ప్రకటన
అమరావతి రైతుల‌కు గుడ్‌న్యూస్.. మలి విడత ప్లాట్ల కేటాయింపుపై CRDA కీలక ప్రకటన
Anasuya Bharadwaj : అనసూయకు గుడి కడతానన్న ఫ్యాన్! - నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
అనసూయకు గుడి కడతానన్న ఫ్యాన్! - నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
Medaram Jatara 2026: ముస్తాబైన మేడారం! జాతరకు వెళ్లే భక్తులు ఈ ఏర్పాట్ల గురించి ముందుగానే తెలుసుకోండి!
ముస్తాబైన మేడారం! జాతరకు వెళ్లే భక్తులు ఈ ఏర్పాట్ల గురించి ముందుగానే తెలుసుకోండి!
Telangana Ministers Meeting: సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్
సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్
ఇండియా-EU ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం ఆటో సెక్టార్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది, కార్ల ధరలు తగ్గుతాయా?
ఇండియా-యూరోప్‌ ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం - కార్ల ధరలపై పడే ఎఫెక్ట్‌ ఇదే
Bank Unions Strike: నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
Embed widget