అన్వేషించండి

Tirupati News : టీటీడీ ఈవో వర్సెస్ భాను ప్రకాష్ రెడ్డి - అసలేం జరిగిందంటే ?

టీటీడీ ఈవో ధర్మారెడ్డి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలిపిరి పాదాల మండపాన్ని తొలగించడం లేదని జీర్ణద్ధరణ మాత్రమే చేస్తున్నామన్నారు.


Tirupati News :  టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిప్డడారు.  అలిపిరి పాదాల మండపాన్ని తొలగిస్తున్నారని ప్రచారం చేయడంపై విమర్శలు గుప్పించారు.  శిధిలావస్థకు చేరుకున్న పురాతన మండపంపై భానుప్రకాష్ రెడ్డి అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏ వి ధర్మారెడ్డి పాల్గొని భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడాు. 

అలిపిరి పాదాల మండపంపై అనవసర విమర్శలు 

అలిపిరి పాదాల మండపం వద్ద పురాతన మండపం శిథిలావస్థకు చేరుకుందన్నారు. అందుకే తిరిగి అదే మండపాన్ని మళ్లీ జీర్ణోదరణ చేస్తున్నామని అంతే తప్ప కూల్చి వేయడం లేదన్నారు.  దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకెళ్లి భానుప్రకాష్ రెడ్డి అనవసరంగా  వివాదం చేస్తున్నారని చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భానుప్రకాష్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు చేశామని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో అడ్డు చెప్పని మాజీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మండపాల జీర్ణోర్ధరణ పనులకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.  భానుప్రకాష్ రెడ్డికి ధైర్యం ఉంటే తిరుమలలోని పార్వేటి మండపం వద్దకు వచ్చి మండపాన్ని పరిశీలించి నిర్మాణం బాగా లేదని చెప్పాలని సవాల్ చేశారు.  భక్తుల సౌకర్యార్థం వారి క్షేమార్థం టీటీడీ చేస్తున్న పనులకు బిజెపి భానుప్రకాష్ రెడ్డి అడ్డుపడడం సరైన విధానం కాదన్నారు.  భాను ప్రకాష్ రెడ్డి ఇల్లు ఎందుకు కట్టుకున్నారో చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు.  

పదో తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు 

ఈ ఏడాది డిసెంబర్ 23వ తారీఖున వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినంకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఈ నెల 10వ తేదీ నుండి భక్తులకు అందుబాటులో ఉంచునున్నట్లు టిటిడి ఈవో వెల్లడించారు. 10 రోజులకు కలిపి రెండు లక్షల 25 వేల టోకెన్లను అందుబాటులో ఉంచునున్నట్లు చెప్పారు. అదే విధంగా రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టికెట్లను కేటాయిస్తామని, శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు 300 రూపాయల టికెట్లు కేటాయించినట్లు ఆయన తెలియజేశారు.. అలాగే సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో 9 ప్రాంతాల్లో 4 లక్షల 25 వేల టోకెన్లను సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచుతామని, తిరుపతిలో జారీ చేసే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను ఒక్క‌ రోజు నుండి టిటిడి‌ కేటాయించిన 9 ప్రాంతాల్లో జారీ చేస్తున్నాంమని తెలిపారు. 

సామాన్య భక్తులకే పెద్ద పీట 

వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాంమని, వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల్లో సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నాంమని,ఇతర ప్రివిలైజ్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి 21 లక్షల 75 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 108 కోట్ల రూపాయలు హుండి ద్వారా ఆదాయం లభించినట్లు చెప్పారు.. ఒక కోటి 5 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించగా, 47 లక్షల ఐదు వేల మంది భక్తులు అక్టోబర్ నెలలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.. 8 లక్షల 30 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
Anchor Neha Chowdary: డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy felicitated Boy | షాద్ నగర్ సాహసబాలుడికి సీఎం రేవంత్ సన్మానం | ABP DesamLeopard Spotted near Shamshabad Airport | ఎయిర్ పోర్ట్ గోడ దూకిన చిరుతపులి | ABP DesamOld Couple Marriage Viral Video | మహబూబాబాద్ జిల్లాలో వైరల్ గా మారిన వృద్ధుల వివాహం | ABP DesamVishwak Sen on Gangs of Godavari | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నరాల్లోకి ఎక్కుతుందన్న విశ్వక్ సేన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
Anchor Neha Chowdary: డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Sleeping Tips for Babies : పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
CBSE Results: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
CBSE విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
Kriti Sanon Latest Photos : కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు.. డెనిమ్ షార్ట్స్​తో మతి పోగొడుతున్న సుందరి
కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు.. డెనిమ్ షార్ట్స్​తో మతి పోగొడుతున్న సుందరి
Shamshabad ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం- ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ
Shamshabad ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం- ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ
Embed widget