By: ABP Desam | Updated at : 20 Aug 2023 08:48 AM (IST)
పోలాక్షి అమ్మవారి ఆలయం బయటే పొంగళ్లు పెడుతున్న భక్తులు
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పోలాక్షమ్మ జాతర సందర్భంగా పొంగళ్ళు పెట్టేందుకు వచ్చిన దళితులను పోలాక్షమ్మ ఆలయంలోకి వెళ్ళనివ్వకుండా అగ్ర కులస్తులు అడ్డుకున్నారు. వారు ఏకంగా ఆలయానికి తాళం వేసి అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. దళితులు ఆలయం వద్దకు వెళ్ళే సరికే అప్పటికే ఆలయ పూజారి దళిత గ్రామస్థులకు ప్రవేశం లేదంటూ ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో దళితులు ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కా
నీ ఆలయ పూజారి, గ్రామస్తులు స్పందించక పోవడంతో చేసేది లేక ఆలయం ఎదుటే పొంగళ్ళు పెట్టి అమ్మవారికి వారు మొక్కులు చెల్లించుకున్నారు. దళిత పోరాట హక్కుల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పోలాక్షమ్మ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని మూడు నెలలుగా తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, తహసీల్దార్ ప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ రోజుల్లోనూ తమపై అంటరానితనం ప్రదర్శిస్తుండడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ
TTD News: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఎనిమిది రోజుల వివరాలు ఇవిగో !
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
/body>