అన్వేషించండి

MP Sanjeev Kumar: తిరుమలలో నిఘా వైఫల్యం- సీఎం జగన్ స్టిక్కర్ తో తిరిగిన కర్నూల్ ఎంపీ!

YSRCP MP in Tirumala with Jagan Sticker: అన్య మతానికి సంబంధించిన ప్రచారం చేయడం గానీ, పార్టీ గుర్తులు, పోస్టర్లు ప్రదర్శించడం తిరుమలలో నిషిద్ధం. వైసీపీ ఎంపీ సీఎం జగన్ స్టిక్కర్ తో తిరుమలకు వచ్చారు.

YSRCP MP Sanjeev Kumar Visits Tirumala: తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడి సన్నిధిలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అన్య మతానికి సంబంధించిన ప్రచారం చేయడం గానీ, పార్టీ గుర్తులు, పోస్టర్లు బహిరంగంగా ప్రదర్శించడం తిరుమలలో నిషిద్ధం కానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ తిరుమలలో సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్ ప్రదర్శించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తిరుమలలో నిఘా వైఫల్యమంటూ హాట్ టాపిక్ అయింది.
అసలేం జరిగిందంటే..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న మొబైల్ తో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ తిరుమలకు వచ్చారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న తరువాత తిరుమల ఆలయ వెలుపల వచ్చిన సమయంలో అధికార పార్టీ ఎంపీ సంజీవ కుమార్ ఏపీ సీఎం జగన్ స్టిక్కర్ ఉన్న తన సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని తిరగడం హాట్ టాపిక్ గా మారింది. 

సాధారణంగా తిరుమలకు మద్యం, మాంసంతో పాటు పార్టీల కండువాలు, జెండాలు, రాజకీయ పార్టీల నేతల స్టిక్కర్లు, ప్రచార సామాగ్రి, అన్య మతాల చిహ్నాలు పూర్తిగా నిషేధమని తెలిసిందే. అలిపిరి టోల్ గేట్ దగ్గరే భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు నిషేధిత వస్తువులు తిరుమలకు రావడం, వివాదం చెలరేగడం గత కొంత కాలంగా పరిపాటిగా మారింది. ఇటీవల ఏకంగా ఓ వాహనంపై ఛత్రపతి శివాజీ స్టిక్కర్ ను తొలగించడంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చివరికి భద్రతా సిబ్బంది తెలియక పొరపాటుగా తొలగించారని టిటిడి ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. 
అలాంటిది ఓ వైసీపీ ఎంపీ సీఎం జగన్ స్టిక్కర్ ఉన్న సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం ముందు అందరికి కనిపించేలా తిరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు సామాన్యులకేనా, అధికార పార్టీ నేతలకు వర్తించవా అంటూ సామాన్యులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ నేతలు వైసీపీ లోగోలు, సీఎం జగన్ ఫొటోలు ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read: TTD News: చిరుత దాడి: అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు, భక్తులు ఈ సూచనలు పాటించాల్సిందే - ఈవో

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివ నాయుడు,కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Also Read: Tirumala: చిరుతపులి దాడి ఘటన - బిడ్డకు ఏమైనా జరిగితే ప్రాణాలు వదిలేవాళ్లం! కౌశిక్ తల్లితండ్రులు 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget