అన్వేషించండి

Tirumala Darshan: బుధవారం రోజు ఆ సేవను టీటీడీ రద్దు చేసేందుకు కారణం ఇదే

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.. ప్రతి బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన బెల్లం పాయసంను నైవేద్యంగా సమర్పిస్తారు.. మంగళవారం రోజున 62,971 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 25,534 మంది తలనీలాలు సమర్పించగా, 3.39 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.. దీంతో  టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.. 

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. ఇందులో‌ భాగంగా బుధవారం నాడు ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం, బెల్లంతో తయారు చేసిన పాయసంను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.. 

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్ర కళషాభిషేకం" ను టిటిడి‌ రద్దు చేసింది.. ఉత్సవిగ్రహాల పరిరక్షణ నేపధ్యంలో ఏడాదికి‌ ఓమారు మాత్రమే నిర్వహించాలని ఆగమ సలహాదారుల మండలి‌ సలహాల మేరకూ నిర్ణయం తీసుకుంది.. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.. 

అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు.. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల- ఒక్కోరైతు ఖాతాలో 2 వేల రూపాయలు జమ
పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల- ఒక్కోరైతు ఖాతాలో 2 వేల రూపాయలు జమ
Operation Akhal: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం- కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం 
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం- కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం 
War 2: రిలీజ్‌కు ముందే 'వార్ 2' సెన్సేషన్ - ఎన్టీఆర్, హృతిక్ మూవీ సరికొత్త రికార్డులు
రిలీజ్‌కు ముందే 'వార్ 2' సెన్సేషన్ - ఎన్టీఆర్, హృతిక్ మూవీ సరికొత్త రికార్డులు
Anasuya Bharadwaj: చెప్పు తెగుద్ది... మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా? - యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
చెప్పు తెగుద్ది... మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా? - యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

వీడియోలు

National Best Films 2023 | జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల సత్తా | ABP Desam
Bhagavanth Kesari National Award | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి | ABP Desam
India vs England 5th Test Day 1 Highlights | పుంజుకుంటున్న టీం ఇండియా
Karun Nair Half Century | హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ్ నాయర్
Shubman Gill Record in Oval Test Match | సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన కెప్టెన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల- ఒక్కోరైతు ఖాతాలో 2 వేల రూపాయలు జమ
పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల- ఒక్కోరైతు ఖాతాలో 2 వేల రూపాయలు జమ
Operation Akhal: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం- కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం 
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం- కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం 
War 2: రిలీజ్‌కు ముందే 'వార్ 2' సెన్సేషన్ - ఎన్టీఆర్, హృతిక్ మూవీ సరికొత్త రికార్డులు
రిలీజ్‌కు ముందే 'వార్ 2' సెన్సేషన్ - ఎన్టీఆర్, హృతిక్ మూవీ సరికొత్త రికార్డులు
Anasuya Bharadwaj: చెప్పు తెగుద్ది... మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా? - యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
చెప్పు తెగుద్ది... మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా? - యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
Home Loan Tips : గృహ రుణం తీసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు -  బ్యాంక్ వారు చెప్పరు!
గృహ రుణం తీసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు - బ్యాంక్ వారు చెప్పరు!
Pradhan Mantri Vidya Lakshmi Scheme: పేద విద్యార్థులకు గుడ్ న్యూస్! చదువు కోసం ₹7.5 లక్షల వరకు లోన్..అప్లై చేసుకోండి!
పేద విద్యార్థులకు గుడ్ న్యూస్! చదువు కోసం ₹7.5 లక్షల వరకు లోన్..అప్లై చేసుకోండి!
Telangana News: సరోగసి కేసులో ఊహించని ట్విస్ట్, నోరువిప్పిన ఏ1 డాక్టర్ నమ్రత; ఏ పాపం తెలీదని వాదన
సరోగసి కేసులో ఊహించని ట్విస్ట్, నోరువిప్పిన ఏ1 డాక్టర్ నమ్రత; ఏ పాపం తెలీదని వాదన
PM Kisan Yojana : రైతులకు గుడ్ న్యూస్! నేడు PM Kisan 20వ విడత నిధులు విడుదల, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
నేడు PM Kisan 20వ విడత నిధులు విడుదల, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Embed widget