అన్వేషించండి

TTD News: టీటీడీ తీరుపై పీఠాధిపతులు, మఠాధిపతుల ఆగ్రహం - త్వరలో తిరుపతిలో భారీ సభ

శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని పీఠాధిపతులు తీవ్ర విమర్శలు చేశారు.

హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేస్తున్న టీటీడీ అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం స్వప్నా నందుల ఆశ్రమం శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి విమర్శించారు. తిరుమల శ్రీవారిపై జరుగుతున్న అపోహలను తెలుసుకోవడానికి సుమారుగా 40 మందిపైగా పీఠాధిపతులు, మఠాధిపతులు తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చారు. శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని తీవ్ర విమర్శ చేశారు శ్రీవారి దగ్గరికి వెళ్లాలంటే పీఠాధిపతులు కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలని అన్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో శ్రీవారికి నిలువునామం కూడా తీసివేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న అధికారులు వారి మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీటీడీ ఈవోపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కులాలకు మతాలకు అతీతంగా అందర్నీ సమానంగా పీఠాధిపతులు, మఠాధిపతులు చూస్తారని, అలాంటి వారికే తీవ్ర అవమానం జరిగేలా టీటీడీ సిబ్బంది ప్రవర్తించారని అన్నారు. హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న దాడిపై, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వారితో పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి లక్షలాది మంది హిందువులతో, హిందూ మహాసభను తిరుపతి నగరంలో నిర్వహించబోతున్నట్లుగా శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి స్పష్టం చేశారు.

వైభవంగా సాగుతున్న పద్మావతి అమ్మవారి ఉత్సవాలు

శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్రను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి వారి పాదాల చెంత లక్ష్మీ కాసుల హారాన్ని ఉంచి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం హారతి సమర్పించి ఆలయం వెలుపలకు తీసుకొచ్చి, తిరుమాడ విధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయని అన్నారు. అమ్మవారు తన ఇష్ట వాహనమైన గజ హవనంపై విహరిస్తూ, ఆలయ మాడ విధుల్లో భక్తులను కటాక్షించనున్నారని తెలిపారు. శ్రీవారి కాసుల హారాన్ని గజవాహనంపై విహరించే అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అధికారులు వివరించారు. 

గర్భాలయంలో స్వామి వద్ద ఉంచి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చామని... అనంతరం కాసుల హారాన్ని శ్రీవారి ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి తిరుచానూరుకు పంపనున్నామని చెప్పారు. ఈనె 28వ తేదీ పంచమి తీర్థం సందర్భంగా ఆరోజు వేకువజాము అమ్మవారికి సారె తిరుమల నుంచి తీసుకెళ్లనున్నామని చెప్పారు. అశేష సంఖ్యలో భక్తులు పంచమి తీర్థంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో భారీ ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈనెల 28వ తేదీన పంచమి తీర్థం వేడుకలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని అన్నారు.

ఈరోజు ఉద పల్లకీ ఉత్సవం పై, రాత్రి గజవాహనంపై, 25వ తేదీన శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం, 26వ శనివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై, 27వ ఆదివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై, 28వ తేదీన సోమవారం పంచమీ తీర్థాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అదే రోజు‌ సాయంత్రం‌ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించడంతో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని పద్మావతి అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు బాబు స్వామి తెలిపారు. ఇక పంచ‌మితీర్థం రోజు భ‌ద్ర‌తా విధుల‌కు 2500 మంది పోలీసుల‌ను వాడబోతున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వయంతో భక్తులకు‌ సేవలందించే‌ విధంగా టీటీడీ ఈవో‌ ఏవి.ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget