అన్వేషించండి

TTD News: టీటీడీ తీరుపై పీఠాధిపతులు, మఠాధిపతుల ఆగ్రహం - త్వరలో తిరుపతిలో భారీ సభ

శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని పీఠాధిపతులు తీవ్ర విమర్శలు చేశారు.

హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేస్తున్న టీటీడీ అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం స్వప్నా నందుల ఆశ్రమం శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి విమర్శించారు. తిరుమల శ్రీవారిపై జరుగుతున్న అపోహలను తెలుసుకోవడానికి సుమారుగా 40 మందిపైగా పీఠాధిపతులు, మఠాధిపతులు తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చారు. శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని తీవ్ర విమర్శ చేశారు శ్రీవారి దగ్గరికి వెళ్లాలంటే పీఠాధిపతులు కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలని అన్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో శ్రీవారికి నిలువునామం కూడా తీసివేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న అధికారులు వారి మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీటీడీ ఈవోపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కులాలకు మతాలకు అతీతంగా అందర్నీ సమానంగా పీఠాధిపతులు, మఠాధిపతులు చూస్తారని, అలాంటి వారికే తీవ్ర అవమానం జరిగేలా టీటీడీ సిబ్బంది ప్రవర్తించారని అన్నారు. హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న దాడిపై, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వారితో పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి లక్షలాది మంది హిందువులతో, హిందూ మహాసభను తిరుపతి నగరంలో నిర్వహించబోతున్నట్లుగా శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి స్పష్టం చేశారు.

వైభవంగా సాగుతున్న పద్మావతి అమ్మవారి ఉత్సవాలు

శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్రను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి వారి పాదాల చెంత లక్ష్మీ కాసుల హారాన్ని ఉంచి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం హారతి సమర్పించి ఆలయం వెలుపలకు తీసుకొచ్చి, తిరుమాడ విధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయని అన్నారు. అమ్మవారు తన ఇష్ట వాహనమైన గజ హవనంపై విహరిస్తూ, ఆలయ మాడ విధుల్లో భక్తులను కటాక్షించనున్నారని తెలిపారు. శ్రీవారి కాసుల హారాన్ని గజవాహనంపై విహరించే అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అధికారులు వివరించారు. 

గర్భాలయంలో స్వామి వద్ద ఉంచి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చామని... అనంతరం కాసుల హారాన్ని శ్రీవారి ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి తిరుచానూరుకు పంపనున్నామని చెప్పారు. ఈనె 28వ తేదీ పంచమి తీర్థం సందర్భంగా ఆరోజు వేకువజాము అమ్మవారికి సారె తిరుమల నుంచి తీసుకెళ్లనున్నామని చెప్పారు. అశేష సంఖ్యలో భక్తులు పంచమి తీర్థంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో భారీ ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈనెల 28వ తేదీన పంచమి తీర్థం వేడుకలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని అన్నారు.

ఈరోజు ఉద పల్లకీ ఉత్సవం పై, రాత్రి గజవాహనంపై, 25వ తేదీన శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం, 26వ శనివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై, 27వ ఆదివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై, 28వ తేదీన సోమవారం పంచమీ తీర్థాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అదే రోజు‌ సాయంత్రం‌ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించడంతో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని పద్మావతి అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు బాబు స్వామి తెలిపారు. ఇక పంచ‌మితీర్థం రోజు భ‌ద్ర‌తా విధుల‌కు 2500 మంది పోలీసుల‌ను వాడబోతున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వయంతో భక్తులకు‌ సేవలందించే‌ విధంగా టీటీడీ ఈవో‌ ఏవి.ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget