అన్వేషించండి

TDP News: మరో టీడీపీ కార్యకర్త దారుణ హత్య, చంపేస్తారంటూ కొన్ని రోజుల కింద వీడియో సైతం

Punganur : మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మూకల అరాచకాలు ఆగడం లేదు. టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న రామకృష్ణని శనివారం దారుణంగా హత్య చేశారు.


 Punganur : మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మూకల అరాచకాలు ఆగడం లేదు. టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న కాగితి రామకృష్ణనాయుడిని శనివారం దారుణంగా హత్య చేశారు. తనను చంపేస్తారంటూ పదిహేను రోజుల క్రితమే వీడియోలు పెట్టి..పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవటంతో టీడీపీ కార్యకర్త కాగితి రామకృష్ణనాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఆయనను వైసీపీకి చెందిన కొందరు నాయకులు వేటకొడవళ్లతో నరికి చంపారు. శనివారం ఉదయం పొలం పనుల కోసం తన కొడుకుతో కలిసి వెళ్లిన రామకృష్ణ నాయుడును దారి కాచి హత మార్చారు.ఆయన కొడుకు సురేశ్‌కుమార్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో మదన పల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పరోక్షంగా కారణమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. 

చంపేస్తారంటూ వీడియో విడుదల
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా..పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పెద్దిరెడ్డి హవానే నడుస్తుందన్న ప్రధాన ఆరోపణ అధికార పార్టీకి సవాల్ గా మారింది. రామకృష్ణ నాయుడుని చంపిన వ్యక్తులైన వెంకటరమణ, గణపతి, త్రిలోక్, మహేశ్ టీడీపీ గెలిచిన రోజు నుంచి రామకృష్ణ నాయుడుని ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో గెలిచినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో కేక్ కట్ చేసి సంబరాలను చేసిన తనను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని.. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పక్షం రోజు కిందర రామకృష్ణ నాయుడు  వీడియోను విడుదల చేశారు. ఈ ఉదంతం అనంతరం సీఐ.. హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. పోయిన ప్రాణం తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది. 

సంబరాలు చేసుకున్నాడని కక్ష
పుంగనూరు మండలం చండ్రమాకులపల్లి పంచాయతీ కిష్ణాపురానికి చెందిన రామక్రిష్ణ నాయుడు( 55) టీడీపీలో చురుకైన కార్యకర్త. వైసీపీ ఐదేళ్ల పాలనను ఆయన ఎండగట్టేవారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇవ్వగా ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫు పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించారు. ఫలితాలు వెలువడిన రోజున కేక్ కట్ చేసి.. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నాడు.దీనిని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేశ్, త్రిలోక్ లు ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే రామక్రిష్ణపై దాడికి దిగారు. వీరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రామక్రిష్ణ భార్య దేవమ్మను సైతం బైక్ తో ఢీ కొట్టారు. దీంతో ఆమె రెండు కాళ్లు దెబ్బ తిన్నాయి. తమపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇరువర్గాల పై కేసులు నమోదు చేశారు. 


స్పందించని పోలీసులు
ఊళ్లో వైసీపీ అధిక్యత ఉండాలని వార్నింగ్ ఇస్తూ ఇప్పటికే ఆయన మీద నాలుగు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కానీ తప్పించుకున్నాడు. ఐదోసారి మాత్రం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రెండు వారాల క్రితం తన పొలంలో ట్రాక్టర్ తో మట్టి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు డ్రైవర్ తో గొడవకు దిగారు.  అడ్డు వచ్చిన ఆయనను చితకబాదారు. అక్కడితో ఆగకుండా అతని కొడుకు.. కోడలి మీద దాడి చేశారు.  దీనిపై సీఐ శ్రీనివాసులకు కంప్లైంట్ చేసినా స్పందించలేదు. కొంత కాలంగా తమ మీద వైసీపీ  కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా..పోలీసులు స్పందించలేదని రామక్రిష్ణ కుటుంబీకులు వాపోయారు. సీఐ పక్షపాత వైఖరితో వైసీపీ కార్యకర్తలకే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఇప్పటికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవానే నడుస్తుందని చెప్పాడు. ఆసుపత్రికి మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితరులు వచ్చి బాధితులను పరామర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget