By: ABP Desam | Updated at : 14 May 2023 07:27 PM (IST)
రమణ దీక్షితులు, సీఎం జగన్
TTD Hereditary Archaka System: తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడి సన్నిధి తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారం పర్య అర్చకుల సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వంశపారం పర్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయట పెట్టాలని కోరారు.
రెండేళ్ల కిందట కమిటీని నియమించినా, నేటికి ఆ నివేదిక బయట పెట్టలేదు అని ట్విట్టర్ లో తెలిపారు రమణ దీక్షితులు. ఈ నివేదిక బహిర్గతం చేయడం ద్వారా వంశపారంపర్య అర్చకుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా అర్చక సమాజం సీఎం జగన్ కు రుణపడి ఉంటుందన్నారు. 21 జూలై 2021 జీవో ఎంఎస్ నెంబ 185 ప్రకారం జస్టిస్ శివశంకర్ రావు ఏకసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదకి బహిర్గతం చేయాలని శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ కి విజ్ఞప్తి చేశారు.
@ysjagan Honorable CM garu should ask for the report of Justice Sivasankarrao's One man committee about the TTD hereditary archaka system. It is almost two years since the committee was formed as per GO MS No 185 dt 21-7-2021 . We all will be ever thankful to you sir.
— Ramana Dikshitulu (@DrDikshitulu) May 14, 2023
ఆనందనిలయాన్ని వీడియో తీసిన యువకుడు అరెస్ట్
ఆనంద నిలయాన్ని వీడియో తీసారంటూ టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రెండు ప్రత్యేక బృందాలు, ఒక టెక్నికల్ టీంను నియమించి నిందితుడి కోసం గాలించామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. కరీంనగర్ కి చెందిన రాహుల్ రెడ్డి శ్రీవారి ఆలయంలో వీడియోలు తీసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి గురువారం సాయంత్రం రాహుల్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి రాహుల్ మొబైల్ ఫోన్ ని ఆలయంలోకి తీసుకెళ్లాడని, ఆలయంలో తీసిన వీడియోలను రాహుల్ స్టేటస్ లో పెట్టడంతో పాటు వారి బంధువులకు పంపించిన్నట్లు విచారణలో తేలిందన్నారు.
ఆలయంలో వీడియో తీసింది వివాదమవుతున్నట్లు మీడియాలో రావడాని చూసిన రాహుల్ ఎవిడెన్స్ ని చేరిపి వేశాడన్నారు.. రాహుల్ ని ఆలయంలోకి తీసుకెళ్లి భద్రతా లోపం ఎక్కడ జరిగిందో పునః పరిశీలిస్తున్నామని మునిరామయ్య తెలిాపరు. భక్తుల మొబైల్ ఫోన్ ని ఆలయం లోపలకి అనుమతించమని, భద్రతా లోపాలని గుర్తించి, పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.. రాహుల్ ఏ ఆలయంకు వెళ్ళినా, ఆ ఆలయాన్ని వీడియో తీస్తున్నాడని, ఆ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో చిత్రికరణ చేశాడన్నారు. గత నెలలో తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని ఎస్పీకి మెయిల్ వచ్చింది.ఈ మెయిల్ ఫేక్ అని పోలీసులు తేల్చి చెప్పారు.
Tirumala: ఆ భక్తుడి బంగారు చైన్పై శ్రీనివాసుడి ప్రతిమలు- ఆసక్తిగా చూసిన జనం
Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్గ్రేషియా ప్రకటన
APPSC: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?