అన్వేషించండి

Nagari News: మాజీ మంత్రి రోజా వర్సెస్ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ట్వీట్ల వార్

Nagari News: నగరి మాజీ mla రోజా ఎలక్షన్ ఫలితాల తరువాత తొలి సారి బయటకు వచ్చారు. ఆమె మాట్లాడిన మాటల పై జనసేన నాయకులు కౌంటర్ ఇస్తున్నారు కానీ ఉమ్మడి చిత్తూర్ జిల్లా లో మాత్రం ఎవరు స్పందిచడం లేదు

Nagari News: ఆమె మాటలు యుద్దం చేస్తాయి.. మైకు పెడితే ఏమి మాట్లాడుతుందని ఎదురుచూసే వాళ్లు.. మాట్లాడాక ఏ కౌంటర్ ఇవ్వాలని ఆలోచించే వారు. అలాంటి ఆమె ఓటమి తరువాత మరోసారి బయటకు వచ్చింది.. ఆమె మాటల యుద్ధం ప్రారంభమైంది.. మరీ కౌంటర్లు వచ్చాయా.. అసలు ఎవరు ఆమె అని అంటున్నారా అయితే ఆమె మరెవరో కాదు మాజీ మంత్రి ఆర్కే రోజా.

నటిగా... నాయకురాలుగా,ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు ఆర్ కె రోజా. గత 10 సంవత్సరాల కాలంలో నగరి ఎమ్మెల్యే రోజా కంటే ఫైర్ బ్రాండ్ రోజాగా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అనేక సంవత్సరాల తరువాత ఎమ్మెల్యే గా గెలిచి ఆనందాన్ని కన్నీటి తో ప్రారంభించి మీడియాలో నిలిచిన రోజా 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా కాకుండా అధికార పక్షంపై తనదైన శైలిలో మాటల యుద్దం చేశారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తో పాటు ఎమ్మెల్యే గా రోజా కూడా గెలిపించారు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు

అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు నాయకులు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిగత జీవితం పై మాట్లాడేది. దీంతో జనసేన నాయకులకు రోజా కు మాటలు తూటాలుగా పేలేవి. ఇక 2019 నుంచి 2012 వరకు ఎమ్మెల్యే గా ఉండగా.. అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి నియోజకవర్గం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇక ఆమె మాటల కారణంగానే 2024 ఎన్నికల్లో నగరిలో ఓటమిపాలైందని రాజకీయ విశ్లేషకులు అన్నారు.

Nagari News: మాజీ మంత్రి రోజా వర్సెస్ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ట్వీట్ల వార్

ఎక్స్ లో కౌంటర్ 
మాజీ మంత్రి రోజా ఎన్నికల ఓటమి తరువాత పూర్తి గా నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు. కనీసం సోషల్ మీడియా లో సైతం ఎలాంటి పోస్టులు లేకుండా పోవడంతో ఆమెపై అనేక కథనాలు ప్రచారంలో కి వచ్చాయి. ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకి ఏపీ రాజకీయాలు వదిలి తమిళనాడు రాజకీయాల వైపు వెళ్లిపోయిందన్నారు. తమిళం బుల్లి తెర వైపు ఆమె దృష్టి సారించిందని.. జబర్థస్త్ తరహా తమిళ టీవీ షో లకు వెళ్తున్నారంటూ చెప్పారు.. మరికొందరు అయితే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేశారని.. అందుకు ఆమె సోషల్ మీడియా లో కూడా జగన్, వైసీపీ లోగోలు, డీపీ మార్చిందనుకున్నారు. దీనిపై ఎలాంటి ప్రకటన కాని పోస్టులు కాని రోజా లేదా ఆమె వర్గీయులు చేయలేదు.

ఇక తాజా గా ఏపీ వరదల పై రోజా ఓ వీడియో విడుదల చేశారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, 108, 104 వాహనాలు, క్లీన్ ఆంధ్రా వాహనాలు, వైఎస్సార్ హెల్త్ సెంటర్లు ఉండి ఉంటే నేడు సహాయక చర్యలు, ఇతర కష్టాల నుంచి విజయవాడ ప్రజలకు మరింత మెరుగైన చేయవచ్చని అన్నారు. ఇక జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్ లేకుంటే మరింత ఎక్కువ వరద ప్రభావం చూపుతుందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ విజయవాడకు రాలేదని ప్రశ్నించారు. దీనిపై కౌంటర్ ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ సైతం అదే రోజు ప్రెస్ మీట్ నిర్వహించి నేను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే పోలేదు అంటూ చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి స్పందించిన రోజాకు కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్లు ప్రారంభమైంది. ఆనాడు వరదలు వస్తే జగన్ వస్తే సహాయక చర్యలు ఇబ్బంది అని మాట్లాడిన వారు నేడు పవన్ రాలేదని చెప్పడం... సహాయ చర్యలు చేయకపోగా అక్కడ చేసే వారిని విమర్శించడం... విరాళాలు ఇవ్వలేని మీరు కూడా రూ.6 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నారు.

Also Read: భారీ వర్షాల ఎఫెక్ట్, సోమవారం ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

జిల్లాలో మాట్లాడేవారు లేరు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం లో ఎవరికి మంత్రి పదవులు లేవు. గత వైసీపీ ప్రభుత్వం లో ప్రతిపక్ష నాయకులపై విమర్శలు కురిపించారు. ప్రస్తుతం జిల్లాలో  ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీ నాయకుల చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రధానంగా వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని అంటున్నారు. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేసిన విమర్శల పై మీడియా ప్రశ్నిస్తే సైతం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడలేని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం పై వైసీపీ తిరిగి మాటలు యుద్దానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక తాజాగా రోజూ x వేదికగా పెట్టిన పోస్టుకు నగరి ఎమ్మెల్యే భాను కౌంటర్ ఇచ్చారు.

Also Read: Chandrababu: ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముంది, అలర్ట్ గా ఉండాలి - చంద్రబాబు కీలక సూచనలు

టాప్ హెడ్ లైన్స్

Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
Embed widget