అన్వేషించండి

Tirumala News: తిరుమ‌ల ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. ద్విచ‌క్ర‌ వాహ‌నాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు

Tirumala News: తిరుమ‌ల ఘాట్ రోడ్డులో చిరుత క‌న‌పించింద‌న్న వార్త క‌ల‌క‌లం రేపింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన టీటీడీ అధికారులు చ‌ర్య‌లు ప్రారంబించారు. 

Tirumala: శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతోంది.. ఒక చిరుత చిక్కిందని ఊపిరి పీల్చుకునే లోపు... మరో చిరుత క‌నిపించింద‌న్న వార్త భ‌క్తుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. తాజాగా తిరుమ‌ల దారిలో చిరుత సంచరిస్తుంద‌న్న వార్త మ‌రోసారి గుబులు పుట్టిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో మొద‌టి ఘాట్ రోడ్డులోని 55, 56 మ‌లుపు స‌మీపంలో ఒక చిరుత రోడ్డు దాటి అడ‌విలోకి వెళ్లిన‌ట్టు భ‌క్తులు గుర్తించి టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే స్పందించిన అధికారులు అటవీ శాఖ అధికారుల‌తో మాట్లాడారు. భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌పై అధికారులు కొన్ని భ‌ద్రతా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.

సెప్టెంబ‌ర్ 24 వ‌ర‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 9 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే రెండు ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహణాల‌పై వెళ్లే భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు నుంచే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. అట‌వీ శాఖ డిప్యూటీ క‌న్జ‌ర్వేటివ్ అధికారి, టీటీడీ చెబుతున్న‌దాని ప్ర‌కారం ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ మాసాల్లో వ‌న్య‌ప్రాణులు ఎక్కువ‌గా సంతానోత్ప‌త్తిని ప్రారంభిస్తాయ‌ని తెలిపారు. దీంతో మొద‌ట ఘాట్ రోడ్డులో క్రూర మృగాలు నిత్యం రోడ్డు దాటుతుంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు. అందుకే భ‌క్తుల‌తోపాటు వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ దృష్ట్యా మాన‌వ జంతు సంఘ‌ర్ష‌ణ‌ను నివారించ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అధికారులు వివ‌రించారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఈ ర‌క‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అప్ప‌టి వ‌రకు రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల మ‌ధ్య ద్విచ‌క్ర వాహ‌నాల‌ను రోడ్డుపై అనుమ‌తించ‌బ‌డ‌వ‌ని చెప్పారు. భ‌క్తులు ఈ మార్పును గుర్తించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరుతున్నారు. 

రెండు నెల‌ల్లో 6 చిరుత‌లు

గ‌తేడాది ఇదే స‌మ‌యంలో అట‌వీ అధికారులు శ్రీవారి మెట్ల మార్గంలో ఆరు చిరుత‌ల‌ను బోనులో బంధించారు. ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల్లోనే ఈ ఆరు చిరుత‌లను ఫారెస్ట్ సిబ్బంది ప‌ట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తేడాది ఆగ‌స్టు 11వ తేదీన ల‌క్షిత అనే ఆరేళ్ల బాలిక‌పై చిరుత దాడి చేసి చంపేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద న‌డిచి వెళ్తున్న బాలిక‌ను త‌ల్లిదండ్రులు చూస్తుండ‌గానే చిరుత అడ‌విలోకి లాక్కెళ్లింది. ఉద‌యాన్నే ఆల‌యానికి స‌మీపంలో స‌గం తినేసిన బాలిక మృత‌దేహాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. అప్ప‌ట్నుంచి చిరుత‌ను బంధించేందుకు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసిన అధికారులు ఏకంగా ఆరు చిరుత‌ల‌ను బోనుల బంధించడం విశేషం. స‌రిగ్గా ఈసారి కూడా ఆగ‌స్టులో మ‌రోసారి చిరుత సంచారంపై వార్త‌లు రావ‌డంతో అధికారులు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌పై రెండు నెల‌ల‌పాటు నిషేధం విధించారు. 

ఆగష్టు 16న ఛత్రస్థాపనోత్సవం

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16న ఛత్రస్థాపనోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. అర్చ‌కులు శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు చేపడతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తిరుమల ఏడుకొండల్లోనే అత్యంత ఎత్తయిన నారాయణగిరిపై కలియుగంలో  మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవ‌త్స‌రం శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget