అన్వేషించండి

Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్

Ganesh Chaturthi 2024 | గణేష్ చతుర్ధి సందర్భంగా దశ భుజ గణపతి ఆలయం వివరాలు, విశిష్టతను ఇక్కడ అందిస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఉన్న గణపయ్య ఆలయంలో త్రినేత్రుడిగా విఘ్వేశ్వరుడు దర్శనమిస్తారు.

Dashabhuja Ganapathi Temple News | రాయదుర్గం: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎటు చూసినా బొజ్జ గణపయ్యల సందడి కనిపిస్తోంది. భిన్న ఆకృతాల్లో, రంగుల్లో, పలు ప్రత్యేకతలతో గణేషుడి విగ్రహాలను చేసి విక్రయిస్తుంటారు. అయితే గణేష్ చతుర్థి 2024 (Ganesh Chaturthi 2024) సందర్భంగా వినాయకుడికి సంబంధించి ఓ ప్రత్యేకమైన టెంపుల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందామా. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పది చేతులు ఉన్న విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. భక్తుల కోరికలు తీర్చే బొజ్జ గణపయ్య సిద్ధి సమేతంగా కొలువు దీరిన గణనాథుడి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. 
త్రినేతుడ్రిగా బొజ్జ గణపయ్య
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 10 చేతులు గల విఘ్నేశ్వరుడు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడి గణపయ్య మూడు కళ్ళతో భక్తులకు దర్శనమిస్తూ త్రినేత్రుడిగా కొలువై ఉన్నాడు. ఎక్కడైనా విఘ్నేశ్వరుడికి తొండం ఎడమవైపు ఉంటుంది కానీ.. ఇక్కడ మాత్రం దేవాది దేవుడు వినాయకుడికి తొండం కుడివైపుకు తిరిగి ఉండడం ఒక ప్రత్యేకత. విఘ్నేశ్వరుడికి ఇద్దరు భార్యలు సిద్ధి,బుద్ధి కానీ ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడికి మాత్రం ఎడమవైపు భార్య సిద్ధిని చేత్తో ఆలింగణం చేసుకొని ఉన్నట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ వినాయకుడిని సిద్ధి సమేతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. 

Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్

పది చేతుల వినాయకుడు 
ఏ కార్యం మొదలుపెట్టిన ముందుగా విఘ్నేశ్వరుడికి మొదటి పూజ చేసే ఆనవాయితీ మనకి ఎప్పటినుంచో వస్తోంది. అలాంటి బొజ్జ గణపయ్యకు ఎక్కడైనా మనకు నాలుగు చేతులతో మాత్రమే దర్శనం ఇస్తూ ఉంటాడు కానీ.. ఇక్కడ ఉన్న ఘనపయ్య మాత్రం పది చేతులతో మనకి దర్శనం ఇవ్వటం ఇక్కడ ప్రధానమైన ప్రత్యేకత. అందుకే ఈ గణపయ్యను దశబుజ గణపతి దేవాలయంగా పేరు. 

రోజురోజుకీ పెరుగుతున్న గణనాథుడి విగ్రహం
ఇక్కడి గణేశుడు రాతి రూపంలో కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే రాతి రూపంలో ఉన్న గణనాథుడు రోజురోజుకి పెరుగుతూ ఉండడం విశేషం. దేవుడికి ఆభరణాలు చేయించి అలంకరిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా ఆభరణాలను అలంకరించేటప్పుడు అవి దేవుడికి సరిపోకపోవడం పూజారులు గుర్తించారు . ఇలా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడికి అలంకరించే ఆభరణాలను దేవుడికి సరిపోకపోవడంతో విఘ్నేశ్వరుడు విగ్రహ రూపంలో పెరుగుతూ ఉన్నట్లు అర్చకులు గుర్తించారు. సుమారుగా ఈ విగ్రహం 800 నుంచి 1000 సంవత్సరాలుగా ఉన్నట్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుర్తించింది. 

Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్

పూర్ణ టెంకాయ నైవేద్యం
భక్తుల కోరికలు తీర్చే బొజ్జ గణపయ్యగా రాయదుర్గం పట్టణంలో కొలువుదీరిన గణనాథుడికి భక్తులు తమ కోరికను కోరుకుని పూర్ణ టెంకాయను  ( టెంకాయకు పీచు తీయకుండా దేవుడికి సమర్పించడం ) విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారు. కోరుకున్న కోరిక 30 లేదా 40 రోజులలో నెరవేరితే ఆ టెంకాయను భక్తులు తీసుకొని వెళ్లి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ గణపయ్యను దర్శించేందుకు ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. 

Also Read: Vinayaka Chavithi: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!

ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి !
అనంతపురం నగరం నుంచి రాయదుర్గం 100 కిలోమీటర్లు ఉంటుంది.  అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లి అక్కడ బస్సు ఎక్కితే కేవలం రెండు గంటల్లో రాయదుర్గం పట్టణం చేరుకోవచ్చు. అనంతపురం నుంచి రాయదుర్గం కు 150 రూపాయలు బస్సు చార్జీ. రాయదుర్గం పట్నం కర్ణాటక కు సరిహద్దు కావడంతో బళ్లారి నుంచి దేవాలయం కు కేవలం 40 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.

Also Read: Happy Vinayaka Chavithi 2024 : వినాయక చవితి శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఇన్​స్టా, ఫేస్​బుక్​ల్లో ఈ కోట్స్​తో విషెష్ చెప్పేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget