హిందూపురంలో ఫ్లెక్సీ వార్- వైసీపీ, టీడీపీ, జనసేన పోటీ పోటీ నిరసనలు
హిందూపురంలో టీడీపీ, జనసేన నాయకులను విలన్లుగా చిత్రీకరిస్తూ జగన్ను పేదలను రక్షించే ప్రతినిధిగా చూపిస్తూ ప్లెక్సీీలు వెలిశాయి. దీనిపై వారు నడుస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురంలో ఫ్లెక్సీ వార్ ముదిరి ఉద్రిక్తత దారి తీసింది. ప్రతి బహిరంగ సభలో సీఎం జగన్ చెప్పే డైలాగ్తో వైసీపీ నేతలు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధం అంటూ జగన్ను హీరోగా, మిగతా ప్రతిపక్ష నాయకులను విలన్లుగా చిత్రీకరిస్తూ ఈ ఫ్లెక్సీలు పెట్టారు.
హిందూపురంలో ఉదయానికల్లా వెలిసిన ఫ్లెక్సీలపై టీడీపీ, జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీల్లో జగన్ పేదలను రక్షించే ప్రతినిధిగా చూపిస్తూ ఆయనపై దాడి చేసే వ్యక్తులుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ను చూపించారు. మహమ్మద్ ఇక్బాల్ పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.
ఫ్లెక్సీపై వార్
ఫ్లెక్సీలలో చంద్రబాబు, లోకేష్, పవన్ను కించపరిచాలని అభ్యంతరం చెబుతూ టీడీపీ, జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. దీనికి ప్రతిగా వైసీపీ శ్రేణులు కూడా ఆ ఫ్లెక్సీ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్యత తీవ్ర వాదనలు జరిగాయి. తోపులాట కూడా చోటు చేసుకుంది.
హిందూపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను అక్కడ నుంచి చెదరగొట్టారు. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.
టీడీపీ, జనసేన నాయకుల అరెస్టు
హిందూపురం జంక్షన్లో మొదలైన పంచాయితి ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు చించేయడంపై వైసీపీ లీడర్లు మండిపడుతున్నారు. దీనికి కారకులైన వ్యక్తులను అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు రిజిస్టర్ అయిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఫ్లెక్సీ చించివేశారన్న కారణంతో టీడీపీ, జనసేన లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన ముగ్గుర్ని, జనసేనకు చెందిన ఏడుగురు లీర్లను అరెస్టు చేశారు. పది మంది నాయకులను హిందూపురం పోలిసులు అనదపు జూనియర్ జడ్జి రాజ్యలక్ష్మి ముందు హాజరుపరిచారు. వాళ్లకు ఆమె బెయిల్ మంజూరు చేశారు.
పోటాపోటీ నిరసన ర్యాలీలు
జనసేన, టీడీపీ నేతలు తమ లీడర్ ఫ్లెక్సీ చించివేయడంతో ఆందోళన చేపట్టారుు వైసీపీ శ్రేణులు. హిందూపురం పట్టణంలో భారీ ర్యాలికి పిలుపు నిచ్చారు. దీనికి ప్రతిగా తమపై అక్రమంగా కేసులు పెట్టారని జనసేన నాయకులపై ఆందోళన సిద్దమయ్యారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. అలర్టైన పోలీసులు ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets