అన్వేషించండి

Tirupati News: తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?

Tirupati News: తిరుపతి లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పై నివేదిక సిద్దమైంది. మరో మూడు రోజుల్లో నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నారు

Tirupati News: తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన చేసుకోవడం పుణ్యఫలమని ప్రతి హిందూ భక్తుడి ఆశ. ఏడాదిలో జరిగే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తారు. ఇంటిళ్లపాది.. గ్రామాలకు గ్రామాల ప్రజలు... ఇతర బంధువులతో కలిసి పాదయాత్రగా చేరుకుని సప్తగిరులను అధిరోహిస్తారు. గంటలు... రోజులు గడిచిన వేచి ఉండి.. చలికి.. వానకు... ఎండకు సైతం లెక్కచేయకుండా స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తమ ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అదే విధంగా స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతి కి చేరుకున్నారు. 

ఆటో, ట్యాక్సీల వారిది కూడా తప్పు

వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు బస్టాండు, రైల్వే స్టేషన్ కు 8వ తేదీ ఉదయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆటోలు, ట్యాక్సీలు వారు తమ స్వార్థం కోసం అధిక డబ్బులు తీసుకుని భక్తుల కోసం టీటీడీ తిరుపతి లో ఏర్పాటు చేసిన 8 టోకెన్ల కేంద్రాల వద్దకు తరలించారు. ఇవి బయట భక్తులకు ఎక్కడ ఉన్నాయో తెలియదు కనుకు ఆటో, ట్యాక్సీల వారు తరలించారని భక్తులు కొందరు తెలిపారు. ఇక 8వ తేదీ ఉదయం నుంచి భక్తులు వచ్చిన వారిని వచ్చినట్లు క్యూ అనుమతించకపోగా అందరిని రోడ్డు పై, టోకెన్ల జారీ కేంద్రం వద్ద బారులు తీరారు. ఇక చిన్నపాటి రోడ్డు, స్థానికులకు రోడ్డు పై ట్రాఫిక్ అంతరాయం,  పైగా ఉన్న రోడ్డులోనే ఫ్యాన్సింగ్ క్యూ లైన్లు ఏర్పాటు చేసిన కారణంగా బైరాగిపట్టెడ వద్ద పక్కనే ఉన్న పార్కులోని భక్తులకు అనుమతించి అక్కడే నిలబెట్టారు. ఈ క్రమంలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6మంది మృతి చెందగా.. 50 మంది వరకు గాయాలపాలయ్యారు.

ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో

తొక్కిసలాట ఘటన జరిగిన రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం తిరుపతి లో పర్యటించారు. ఈ క్రమంలో పలువురు తెలిపిన వివరాల ప్రకారం తప్పిదం జరిగిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తిరుపతి క్రైం డీఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్ ను సస్పెండ్ చేశారు. టీటీడీ సీవీఎస్వో, జిల్లా ఎస్పీ , టీటీడీ జేఈవో ను బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు. ఆ తరువాత ఇటీవల తిరుపతి టౌన్ డీఎస్పీని సైతం హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో విచారణ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు పోలీస్ శాఖ నుంచి సమాచారం.

ఈ నివేదిక ఆధారంగా ఎవరి పై ఎలాంటి చర్యలు ఉంటాయి.. ఎవరిపై వేటు పడుతుందా.. టీటీడీ ఈవో, అదనపు ఈవో పై చర్యలు ఉంటాయా లేక కింద స్థాయిలో విధులు నిర్వహించిన పోలీస్, టీటీడీ ఉద్యోగులు పైన చర్యలు ఉంటాయా... బైరాగి పుట్టెడు కేంద్రం వద్ద మాత్రమేనా లేక అన్ని కేంద్రాల్లో విచారణ జరిగిందా.. అక్కడ లోటుపాట్లు ఉంటే ఎవరిని బాధ్యులను చేస్తారు. టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తారు కాని కింద స్థాయిలో అధికారులు చేయాల్సిన పనులు లోపం ఎంత... ఇలా వివిధ కోణాల్లో నెలకొన్న అంశాలు ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపై నివేదిక బయటపెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget