అన్వేషించండి
TTD Donation: టీటీడీకి చెన్నైకి చెందిన భక్తుడు రూ.2.02 కోట్ల భారీ విరాళం
Tirumala News చెన్నైకి చెందిన భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. అందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీటీడీ పథకాలకు రూ.2.02 కోట్లు విరాళం చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు
Source : ABP Desam
Donation of Rs 2.02 CRORES FOR TTD Trusts | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి ఓ భ్తులు భారీ విరాళం సమర్పించారు. చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్కు రూ.1.01 కోట్లు మొత్తంగా రూ.2.02 కోట్లు విరాళంగా ఇచ్చారు. వర్ధమాన్ జైన్ శనివారం నాడు తిరుమలకు వచ్చి.. విరాళానికి సంబంధించిన డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమలకు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు సైతం విరాళాలు అందజేస్తుంటారు.
ఇంకా చదవండి
Advertisement






















