అన్వేషించండి

Tiruchanoor News: తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం, వాహన సేవల పూర్తి వివరాలు

Tiruchanoor News: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల వాహన సేవలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Tiruchanoor Padmavathi Ammavari Bramhosthavam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల శ్రీవారి దేవేరిగా భక్తుల పూజలు అందుకుంటున్న అలిమేలు మంగమ్మ కు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండు పూటలా వివిధ వాహన సేవలు జరుగుతాయి. 

శ్రీవారి పట్టపురాణి అభయ వరముద్ర

తిరుమల శ్రీవారి ఆనంద నిలయం లో శ్రీనివాస వక్షస్థలంలో ద్విభుజా వ్యూహలక్ష్మి అన్నట్లుగా రెండు భుజాలతో రెండు చేతుల్లో పద్మాలను ధరించి పద్మములో కూర్చున్న భంగిమలో దర్శనం ఇస్తుంది. ఆమె తిరుపతి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో తిరుచానూరు అనే గ్రామంలో పద్మంలో కూర్చున్న చతుర్భుజాలతో అర్చనామూర్తిగా దర్శనం ఇస్తుంది. అమ్మవారి పైన రెండు చేతుల్లో పద్మాలను.. కింద కుడి, ఎడమ హస్తాల్లో అభయ వరముద్రలతో భక్తులను కటాక్షిస్తుంది శ్రీవారి పట్టపురాణి. 

బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.  ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌ అలంకరణలు చేపట్టారు.  బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందించే ఏర్పాట్లు చేశారు.

రోజుకు 10 వేల మందికి అన్న ప్రసాదాలు

పంచ‌మి తీర్థం సంద‌ర్భంగా డిసెంబ‌రు 5వ తేదీ సాయంత్రం నుండి భ‌క్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన‌ జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల  ద్వారా దాదాపు 50 వేలకు పైగా భ‌క్తుల‌కు తాగునీరు, అన్న ప్రసాదాలు అందించ‌నున్న‌ారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్ తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేయనున్నారు. 

Also Read: Cyclone Fengal Effect: దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను, ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు - ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

 అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీలో హెచ్‌డి క్యాలిటితో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు, ఎస్వీబీసీ ఆన్ లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్ర‌సారాలు అందిస్తారు. అమ్మవారి వాహన సేవలో ఏడు రాష్ట్రాల నుండి క‌ళాబృందాలు, అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీపద్మావతి అమ్మవారి సారె శోభ‌యాత్ర‌లో 1000 మంది కళాకారులు పాల్గొటారు. బ్రహోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు. బ్రహ్మోత్సవాలలో టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు.  

 బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందిస్తారు. అమ్మ‌వారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 10 గంటలకు అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం మొదలవుతుంద‌ని, మధ్యాహ్నం 12.15 గంటల మ‌ధ్య ప‌ద్మ పుష్క‌రిణిలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహించ‌నున్నారు. 

ఆకర్షణీయంగా ఉండేలా క‌ళాబృందాలతో ప్రదర్శనలు
హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో క‌ళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేపట్టారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, వివిధ దేవతామూర్తులు, శ్యాండ్ ఆర్ట్ రూపొందించారు. 

వైభవంగా లక్ష కుంకుమార్చన

వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేసి అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన వైభవంగా చేపట్టారు. 
సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం జరిగింది. 

వాహన సేవల వివరాలు:

తేది                 సమయం   -                  వాహన సేవలు
28.11.2024   ఉ. 9.00 - ఉ.9.30            ధ్వజారోహణము
                     రాత్రి 7.00 - 9.00              చిన్నశేష వాహనము

29.11.2024   ఉ. 8 - 10                         పెద్దశేష వాహనము
                     రా.7 - 9                            హంస వాహనము
30.11.2024  ఉ. 8 - 10                           ముత్యపు పందిరి వాహనము
                     రా. 7- 9                            సింహ వాహనము
01.12.24      ఉ. 8 - 10                          కల్పవృక్ష వాహనము
                    రా. 7 - 9                           హనుమంత వాహనము
02.12.24     ఉ. 8 - 10                          పల్లకి వాహనము
                   రా. 7 - 9                            గజ వాహనము
03.12.24     ఉ. 8 - 10                           సర్వభూపాల వాహనము
                   సా.4.20 - 5.20                   స్వర్ణ రథోత్సవము
                   రా. 7 - 9                             గరుడ వాహనము
04.12.24     ఉ. 8 - 10                           సూర్య ప్రభ వాహనము
                   రా. 7 - 9                            చంద్రప్రభ వాహనము
05.12.24.   ఉ. 8 - 10                           రథోత్సవము
                  రా. 7 - 9                            అశ్వవాహనము
06.12.24    ఉ. 7 - 8                              పల్లకీ ఉత్సవము
                  మ.12.15 - 12.20               పంచమి తీర్థము, రాత్రి: ధ్వజావరోహణం

07.12.2024 : సాయంత్రం - పుష్పయాగం 

బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP DesamMS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP DesamRCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Mangalagiri Latest News: మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి  నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
Kohli Stunning Record:  కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
Embed widget