అన్వేషించండి

Tirupati Ruia Incident : రుయాలో ప్రైవేట్ అంబులెన్స్ దందా వాస్తవమే, కలెక్టర్ కు అధికారుల నివేదిక, ఆర్ఎంవో సస్పెండ్

Tirupati Ruia Incident : తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ అంబులెన్స్ దందాపై అధికారులు కలెక్టర్ కు నివేదిక అందించారు. దీంతో చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Tirupati Ruia Incident : తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు ప్రైవేట్ అంబులెన్స్ దందాపై తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, డీఎంహెచ్ఓ, డీఎస్పీ బృందం విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిని విచారించిన బృందం జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించింది. రుయాలో అంబులెన్స్ మాఫియా నిజమేనని తేలింది. అయితే విచారణ బృందం సమర్పించిన నివేదికను పరిశీలించిన కలెక్టర్ వెంకటరమణరెడ్డి రుయా సూపరింటెండెంట్ భారతి, ఆర్.ఎంవో సరస్వతీ దేవిని బాధ్యులను చేస్తూ సూపరింటెండెంట్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయగా, ఆర్.ఎం.వోను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా బాలుడి మృతదేహం తరలింపు విషయంలో అంబులెన్స్ ను అడ్డుకున్న ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

అంబులెన్స్ మాఫీయా  

గతంలో కూడా ఇలాంటి ఘటనలే అనేకమార్లు తెర మీదకు వచ్చాయి. ఏళ్ల తరబడి రుయా ఆసుపత్రులో ప్రైవేట్ అంబులెన్స్ మాఫీయా పాతుకు పోయింది. రుయా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలపై రోగులు అనేక మార్లు ఆసుపత్రి అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కాదు. డ్రైవర్లు దందాపై సమాచారం అందుకున్న తిరుపతి మాజీ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి నేరుగా రుయా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లుకు వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వేధింపులకు గురి చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరువాత కొద్ది రోజుల పాటు ధరల పట్టిక పెట్టిన డ్రైవర్లు ఆ తరువాత యథావిధిగా ధర పట్టికని తొలగించి ఇష్టం రాజ్యంగా ఎవరికి తోచినట్లు వారు అమాయకపు ప్రజలను టార్గెట్ చేసుకుని అధికంగా నగదు వసూలు చేసేవారు. 

బాధ్యులపై చర్యలకు డిమాండ్ 

సోమవారం రాత్రి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనతో మరొకసారి అంబులెన్స్ డ్రైవర్లు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రుయా ఆసుపత్రిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి ప్రైవేటు అంబులెన్స్ ను ఆసుపత్రి పరిసరాల్లో కాకుండా, ఆసుపత్రికి బయట పెట్టుకుని, సామాన్యుడి అందుబాటులో ఉండే కచ్చితమైన ధరలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Also Read : Minister Vidadala Rajini : మృతదేహాల విషయంలో వ్యాపారమా? బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి విడదల రజిని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Gold: 18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Gold: 18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
Investment Tips: బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
Smriti Mandhana Records: స్మృతి మంధానా తుఫాను సెంచరీతో రికార్డుల మోత.. సిక్సర్లలోనూ అరుదైన ఘనత
స్మృతి మంధానా తుఫాను సెంచరీతో రికార్డుల మోత.. సిక్సర్లలోనూ అరుదైన ఘనత
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Embed widget