అన్వేషించండి

Swaroopanandendra Saraswati : నాకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, టీటీడీపై స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు

Swaroopanandendra Saraswati : తిరుపతి గంగజాతరలో తాతయ్య గుంట గంగమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలక మండలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Swaroopanandendra Saraswati : టీటీడీ పాలక మండలిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ  సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతిలో గంగజాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ పీఠాధిపతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ పాలక మ‌ండలి, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ 900 ఏళ్ల క్రితం అనంతళ్వార్ చేతుల మీదగా ప్రతిష్టించిన విగ్రహమే తాతయ్య గుంట గంగమ్మ వారని చెప్పారు. తన ప్రియ శిష్యుడు కరుణాకర్ రెడ్డి కోరిక మేరకు తాను ఇక్కడకు వచ్చానన్నారు. 

ఏ ప్రభుత్వమైన ఒక్కటే 

దళితలు, వెనకబడిన తరగతుల వారి కోసం పోరాడే ఏకైక పీఠం విశాఖ శారదా పీఠం అని స్వరూపానందేంద్ర సరస్వతి తెలియజేశారు. టీటీడీ పాలక మండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏకైక వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆయన కొనియాడారు. టీటీడీ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి చేపట్టిన పనులకు అండగా శారదా పీఠం ఉండేదని, దళిత గోవిందం,‌ కళ్యాణమస్తు కార్యక్రమాలను విశాఖ పీఠం చేపట్టినట్లు చెప్పారు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి మరోసారి టీటీడీ పాలక మండలికి రారు పుట్టబోరు అని, ఇప్పుడు ఉన్న పాలక మండలి పెద్దగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు.  కరోనా కారణమో లేక బుద్ది మాంద్యమో తనకు తెలియడం లేదన్నారు. తిరుపతి మీడియా ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంటుందన్నారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం ప్రతిష్టించాలని ఆయన కోరారు. విశాఖ శారదా పీఠాధిపతిని టీటీడీ ఆర్జిత సేవల రద్దుపై వివరణ కోరిన మీడియాకు తప్పకుండా సేవలపై స్పందిస్తా్మన్నారు. తనకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, రేపు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతానని ఆయన సమాధానం ఇచ్చారు.

Swaroopanandendra Saraswati : నాకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, టీటీడీపై స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు

గంగమ్మను దర్శించుకున్న మంత్రి రోజా 

తాతయ్యగుంట గంగమ్మను ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించారు. నగరంలోని సెంట్రల్ పార్క్ కూడలి నుంచి ఆలయానికి ఊరేగింపుగా సారె తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. సారెతో ఆలయం వద్దకు చేరుకున్న రోజాకు అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. గంగమ్మకు సారె సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి రోజా తెలిపారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని, 900 ఏళ్ల ముందు అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆమె వివరించారు. గతంలో తిరుపతి గంగమ్మను దర్శించుకుని భక్తులు తిరుమలకు వెళ్లేవారని, ఇకపై కూడా తిరుమల యాత్రకు ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకోవాలని భక్తులను రోజా కోరారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి రోజా సహకారంతో తిరుపతి గంగ జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని,  తన శాఖ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget