అన్వేషించండి

Swaroopanandendra Saraswati : నాకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, టీటీడీపై స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు

Swaroopanandendra Saraswati : తిరుపతి గంగజాతరలో తాతయ్య గుంట గంగమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలక మండలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Swaroopanandendra Saraswati : టీటీడీ పాలక మండలిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ  సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతిలో గంగజాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ పీఠాధిపతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ పాలక మ‌ండలి, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ 900 ఏళ్ల క్రితం అనంతళ్వార్ చేతుల మీదగా ప్రతిష్టించిన విగ్రహమే తాతయ్య గుంట గంగమ్మ వారని చెప్పారు. తన ప్రియ శిష్యుడు కరుణాకర్ రెడ్డి కోరిక మేరకు తాను ఇక్కడకు వచ్చానన్నారు. 

ఏ ప్రభుత్వమైన ఒక్కటే 

దళితలు, వెనకబడిన తరగతుల వారి కోసం పోరాడే ఏకైక పీఠం విశాఖ శారదా పీఠం అని స్వరూపానందేంద్ర సరస్వతి తెలియజేశారు. టీటీడీ పాలక మండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏకైక వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆయన కొనియాడారు. టీటీడీ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి చేపట్టిన పనులకు అండగా శారదా పీఠం ఉండేదని, దళిత గోవిందం,‌ కళ్యాణమస్తు కార్యక్రమాలను విశాఖ పీఠం చేపట్టినట్లు చెప్పారు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి మరోసారి టీటీడీ పాలక మండలికి రారు పుట్టబోరు అని, ఇప్పుడు ఉన్న పాలక మండలి పెద్దగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు.  కరోనా కారణమో లేక బుద్ది మాంద్యమో తనకు తెలియడం లేదన్నారు. తిరుపతి మీడియా ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంటుందన్నారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం ప్రతిష్టించాలని ఆయన కోరారు. విశాఖ శారదా పీఠాధిపతిని టీటీడీ ఆర్జిత సేవల రద్దుపై వివరణ కోరిన మీడియాకు తప్పకుండా సేవలపై స్పందిస్తా్మన్నారు. తనకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, రేపు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతానని ఆయన సమాధానం ఇచ్చారు.

Swaroopanandendra Saraswati : నాకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, టీటీడీపై స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు

గంగమ్మను దర్శించుకున్న మంత్రి రోజా 

తాతయ్యగుంట గంగమ్మను ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించారు. నగరంలోని సెంట్రల్ పార్క్ కూడలి నుంచి ఆలయానికి ఊరేగింపుగా సారె తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. సారెతో ఆలయం వద్దకు చేరుకున్న రోజాకు అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. గంగమ్మకు సారె సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి రోజా తెలిపారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని, 900 ఏళ్ల ముందు అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆమె వివరించారు. గతంలో తిరుపతి గంగమ్మను దర్శించుకుని భక్తులు తిరుమలకు వెళ్లేవారని, ఇకపై కూడా తిరుమల యాత్రకు ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకోవాలని భక్తులను రోజా కోరారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి రోజా సహకారంతో తిరుపతి గంగ జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని,  తన శాఖ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget