అన్వేషించండి

Ap Highcourt : పాదయాత్రపై రైతులు, డీజీపీ పిటిషన్లు కొట్టివేత - ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఇవే !

రైతుల పాదయాత్రపై ఆంక్షలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆరు వందల మందే పాదయాత్ర చేయాలని స్పష్టం చేసింది. మరో వైపు పాదయాత్ర అనుమతి రద్దు పిటిషన్‌ను కొట్టి వేసింది.

Ap Highcourt :  అమరావతి పాదయాత్రపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమరావతి రైతులు, పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ఏపీ డీజీపీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల  కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఆంక్షల ఉల్లంఘించవద్దని రైతులకు స్పష్టం చేసింది.  రైతులు షరతులు ఉల్లంఘిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి సూచించింది. 

ఆరు వందల మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆంక్షలు
 
అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది.  అమరావతి రైతులు పాదయాత్ర చేసుకునే తప్పుడు వేరే ఎవరు వీళ్ళకి అడ్డంకులు కలిగించకుండా పోలీసులు తగు జాగ్రత్తులు తీసుకోవాలని ఆదేశించింది. పది రోజుల కిందట..  అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు  ఆంక్షలు విధించింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చే వాళ్లంతా రోడ్డుకు రెండు వైపులా నిలబడి మద్దతు తెలపాలని సూచించింది. పాదయాత్రలో కలిసి నడవకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలని ఆదేశించింది.  

ఆరు వందల మందికి ఐడీ కార్డులివ్వాలని హైకోర్టు ఆదేశాలు

అయితే ఆరు వందల మందికి పోలీసులు ఐడీ కార్డులు ఇవ్వలేదని నూట యభై మందికి మాత్రమే ఇచ్చారని... రైతులు హైకోర్టుకు తెలిపారు. అలాగే పాదయాత్రలో ఐడీ కార్డులు ఉన్న వారే పాల్గొనాలనడం సరి కాదని.. కొంత మంది యాత్ర మధ్యలో వెళ్తూంటే.. మరికొంత మంది కలుస్తూంటారని వాదించారు.  పాదయాత్రలు చేస్తున్న ఎవరికీ లేని ఆంక్షలు తమకు ఎందుకని కోర్టును ఆశ్రయించారు. అయితే వారికి ఊరట లభించలేదు. ఆరు వందల మందితోనే పాదాయత్ర చేాయలని నిర్ణయంచారు. 

పాదయాత్ర ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న రైతులు

పది రోజుల కిందట అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఐడీ కార్డులు చూపించాలని రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు.  అనుమతి ఉన్నవారిని కాకుండా మిగిలిన వారి వాహనాలను అనుమతించమని పోలీసులు స్పష్టం దీంతో, అక్కడ రైతులు.పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం అయింది. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను  నిలిపివేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారికి ఊరట లభించలేదు. దీంతో రైతులు ఏం చేయబోతున్నారన్నది కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Embed widget