అన్వేషించండి

TDP Members Walkout: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్ - 'అబద్ధాలు వినలేకపోతున్నాం' అంటూ నినాదాలు, బీఏసీ సమావేశం బహిష్కరణ

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందంటూ నినాదాలు చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.

TDP Members Walkout From AP Assembly: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రీయింబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ తెలపగా.. అంతా అబద్ధం అంటూ నినాదాలు చేశారు. 'మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ' అని, రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, అంగన్వాడీలకు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీని బహిష్కరించిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోటా పోటీ నినాదాలు

అసెంబ్లీలో పోటాపోటీ నినాదాలతో గందరగోళం తలెత్తింది. టీడీపీ సభ్యులు 'బై బై జగన్' అంటూ నినాదాలు చేయగా.. వారికి పోటీగా వైసీపీ సభ్యులు 'జై జై జగన్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పేదలందరికీ రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దిశ చట్టం ఎక్కడా అంటూ కేకలు వేశారు. 'రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ.?. ఇన్ పుట్ సబ్సిడీ రైతులను కాదని.. వైసీపీ నేతలకు ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, అంగన్వాడీలకు జీతాల పెంపు ఏదీ?' అంటూ నినదించారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. 

బాలకృష్ణ ఆగ్రహం

అంతకు ముందు అసెంబ్లీకి వెళ్లే సమయంలో టీడీపీ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది.? అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సచివాలయ అగ్నిమాపక కేంద్రం వద్ద 'బై బై జగన్' అంటూ ఫ్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. 'వైసీపీ ప్రభుత్వ అని అయిపోయింది. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారు. అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.' అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వచ్చారు.

అచ్చెన్నాయాడు విమర్శలు

అంతకు ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. 'ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే పార్టీలు తెలుగుదేశం, జనసేన కావు. చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా సీఎం జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. జగన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు.' అంటూ మండిపడ్డారు.

Also Read: AP Assembly: 'జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం' - అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Make In Andhra Pradesh: ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
Andhra Pradesh Capital: అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
Tata Punch EMI : సరికొత్త టాటా పంచ్‌ కారును అనంతపురంలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?
సరికొత్త టాటా పంచ్‌ కారును అనంతపురంలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?
AnanthaBabu Bail Cancelled: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు - ఇక విచారణ పూర్తయ్యే వరకూ జైల్లోనే?
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు - ఇక విచారణ పూర్తయ్యే వరకూ జైల్లోనే?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Trisha News: విజయ్ ముఖ్యమంత్రి అయినా త్రిషకు తప్పని ఇబ్బందులు
విజయ్ ముఖ్యమంత్రి అయినా త్రిషకు తప్పని ఇబ్బందులు
IPL 2026 KKR VS RCB Result Update: కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
Top Electric Scooters Above 120 Range: 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన టూవీలర్ ఈవీల జాబితా ఇదే! ధరలు, ఫీచర్స్ తెలుసుకోండి!
120 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన టూవీలర్ ఈవీల జాబితా ఇదే! ధరలు, ఫీచర్స్ తెలుసుకోండి!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Government Approved EV Chargers: దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! భారీ నిధుల విడుదల!
MS Dhoni Skips LSG Match: LSG మ్యాచ్‌కు దూరంగా ఎంఎస్ ధోనీ- సీఎస్కే అభిమానులకు నిరాశ తప్పదా?
LSG vs CSK మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా? బిగ్ అప్డేట్ గురించి తెలుసా?
Embed widget