అన్వేషించండి

TDP Leaders: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతల బృందం, 50 పేజీల రిపోర్ట్ అందజేత

TDP Leaders: ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాతో కూడిన బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్ట్రంలో చోటు జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించారు.

TDP Leaders: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బుధవారం టీడీపీ నేతల బృందం కలిసింది. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాతో కూడిన బృందం గవర్నర్‌ను కలిసి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో చోటు జరుగుతున్న పరిణామాలను వివరించారు. 50 పేజీలతో కూడిన వివరాలను గవర్నర్‌కు అందజేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసుల్లో టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు సమర్పించారు. 

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, టీడీపీ నాయకుల గృహ నిర్బంధం వంటి అనేక అంశాలను గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకు వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని గవర్నరుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులేంటీ..? అందులోని వాస్తవాలేంటి..? అనే అంశాన్ని టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో గవర్నర్‌ను టీడీపీ నేతలు కలవడం ఇది రెండో సారి. 

సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమరావతిలో ప్రజావేదిక బద్దలు కొట్టినప్పటి నుంచి తాజాగా చంద్రబాబు అరెస్ట్ వరకు 50 పేజీలతో కూడిన రిపోర్ట్ అందించినట్లు చెప్పారు. ఈ విషయాలపై వాస్తవాలను గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. గవర్నర్ స్పందిస్తూ.. తన అధికారాల మేరకు చేయవల్సినదంతా చేస్తానని హామీ ఇచ్చినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాజ్యాంగ సంస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. తనపై, చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్క చిన్న ఆధారం కూడా లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఆలయాలపై దాడుల గురించి గవర్నర్‌కు వివరించామన్నారు. 

చంద్రబాబుపై కేసు పెట్టి 40 రోజులు జైలులో పెట్టారని, ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేదన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసిన నాయకుడిని ఒక ఉగ్రవాదిలా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని అన్నారు. నాలుగేళ్ల 8 నెలల్లో కేవలం టీడీపీ నేతలపై కేసు పెట్టారని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలతో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ లకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్షాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా జగన్ తన స్వార్థమే అజెండాగా అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కాపాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే కక్ష పూరిత వేధింపులను అడ్డుకోవాలని, రూల్ ఆఫ్ లా కాపాడమని కోరినట్లు యనమల వివరించారు.

టీడీపీ నేతలతో నారా లోకేష్ సమావేశం
చంద్రాబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో సీనియర్ నాయకుడు బుచ్చెయ్య చౌదరి, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, కాలువ శ్రీనివాసులు, పలువురు సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరమైన అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని లోకేష్ వారికి సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget