అన్వేషించండి

TDP Leaders: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతల బృందం, 50 పేజీల రిపోర్ట్ అందజేత

TDP Leaders: ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాతో కూడిన బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్ట్రంలో చోటు జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించారు.

TDP Leaders: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బుధవారం టీడీపీ నేతల బృందం కలిసింది. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాతో కూడిన బృందం గవర్నర్‌ను కలిసి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో చోటు జరుగుతున్న పరిణామాలను వివరించారు. 50 పేజీలతో కూడిన వివరాలను గవర్నర్‌కు అందజేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసుల్లో టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు సమర్పించారు. 

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, టీడీపీ నాయకుల గృహ నిర్బంధం వంటి అనేక అంశాలను గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకు వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని గవర్నరుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులేంటీ..? అందులోని వాస్తవాలేంటి..? అనే అంశాన్ని టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో గవర్నర్‌ను టీడీపీ నేతలు కలవడం ఇది రెండో సారి. 

సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమరావతిలో ప్రజావేదిక బద్దలు కొట్టినప్పటి నుంచి తాజాగా చంద్రబాబు అరెస్ట్ వరకు 50 పేజీలతో కూడిన రిపోర్ట్ అందించినట్లు చెప్పారు. ఈ విషయాలపై వాస్తవాలను గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. గవర్నర్ స్పందిస్తూ.. తన అధికారాల మేరకు చేయవల్సినదంతా చేస్తానని హామీ ఇచ్చినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాజ్యాంగ సంస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. తనపై, చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్క చిన్న ఆధారం కూడా లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఆలయాలపై దాడుల గురించి గవర్నర్‌కు వివరించామన్నారు. 

చంద్రబాబుపై కేసు పెట్టి 40 రోజులు జైలులో పెట్టారని, ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేదన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసిన నాయకుడిని ఒక ఉగ్రవాదిలా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని అన్నారు. నాలుగేళ్ల 8 నెలల్లో కేవలం టీడీపీ నేతలపై కేసు పెట్టారని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలతో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ లకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్షాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా జగన్ తన స్వార్థమే అజెండాగా అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కాపాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే కక్ష పూరిత వేధింపులను అడ్డుకోవాలని, రూల్ ఆఫ్ లా కాపాడమని కోరినట్లు యనమల వివరించారు.

టీడీపీ నేతలతో నారా లోకేష్ సమావేశం
చంద్రాబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో సీనియర్ నాయకుడు బుచ్చెయ్య చౌదరి, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, కాలువ శ్రీనివాసులు, పలువురు సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరమైన అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని లోకేష్ వారికి సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
YS Jagan Politics: పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?
పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?

వీడియోలు

US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget