అన్వేషించండి

Devineni Uma On Sajjala : కోడ్ ఉల్లంఘిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి - టీడీపీ డిమాండ్

Andhra News : సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కౌంటింగ్ ను గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.

Elections 2024 :   నిబంధనలు పాటించే వాళ్లు కౌటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై  ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని  టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  జగన్మోహన్ రెడ్డి , సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్ లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని ..జవహర్ రెడ్డి సహకారంతో వీరి ఆటలు సాగుతున్నాయన్నారు.  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహన్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.  

సలహాదారుగా ప్రజల సొమ్ము తింటున్న సజ్జలకు బుద్ది ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.  ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. ఇప్పుడు ఓటమి భయంతో కౌంటింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించరాు.  రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదని, టీడీపీ-జనసేన ఏజెంట్లకు అడుగడుగునా అడ్డం పడాలని సజ్జల హితబోధ చేయడం సిగ్గుచేటన్నారు.  ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోమనకుండా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ఏడుస్తున్నాడని రాష్ట్రానికి మీరు చేసిన నష్టం చాలదా? తప్పులు చేసినా కాపాడతామని భరోసా ఇస్తారా అని  ప్ర్నించారు. 

సజ్జల మాటలను బట్టి చూస్తే  వైసీపీకి చట్టం, ఎన్నికల సంఘం పట్ల ఉన్న గౌరవం ఏ పాటిదో అర్ధమవుతుందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.  ఇలా చట్టాలను అతిక్రమించే వారిని ఉపేక్షించకూడదన్నారు.  సజ్జల నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓటమి భయంతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారన్నారు.  పైగా వైసీపీ చీఫ్ ఏజెంట్లకు సజ్జల చేసిన హితభోధలను బ్లూ మీడియా పదేపదే ప్రసారం చేసిందని.. ఆయా యాజమాన్యలపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.  ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సజ్జల ఉల్లంఘించాడని దేవిని ఉమ  స్పష్టం చేశారు.                       

తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు పలువురు రిటర్నింగ్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  యర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారిణి శ్రీలేఖను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించాడు. మాకు రూల్స్ చెప్పకూడదు, అడ్డుపడకూడదని హెచ్చరించాడు. అయినా ఆర్వోను విధుల నుంచి తప్పించారన్నారు.  నిజాయితీగా పని చేస్తున్న  అధికారులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. లండన్‌లో ఉన్న జగన్ కౌంటింగ్  రోజున అల్లర్లు చేయమని కేడర్ ను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు.  నిబంధనలు పాటంచని వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర పగడ్భందీ చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని  కోరారు.                                       

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget