అన్వేషించండి

Kondapalli : కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి - టీడీపీ అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం ! హైకోర్టు తీర్పు తర్వాతే తుది ఫలితం !

మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. టీడీపీ చైర్మన్ అభ్యర్థికి ఒక్క ఓటు అధికంగా వచ్చింది. హైకోర్టు తీర్పును బట్టే తుది ఫలితం వెలువడనుంది.

కృష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయతీ చైర్మన్‌గా టీడీపీకి చెందిన కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబును పదహారు మంది బలపరిచారు . ఫలితాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. తెలుగుదేశం పార్టీకి 15 మంది కౌన్సిలర్ల బలం ఉండగా ఎక్స్ అఫీషియో ఓటును ఎంపీ కేశినేని నాని ఉపయోగించుకున్నారు. ఈ కారణంగా టీడీపీ బలం 16కి చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగించుకోవడంతో వారి బలం 15కు చేరింది. కానీ ఒక్క ఓటు టీడీపీకి ఎక్కువగా ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు ఆ పార్టీకే దక్కాయి. 

Also Read : రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !

కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి తీవ్ర ఉద్రిక్తలకు కారణం అవుతున్నాయి. కౌంటింగ్‌లో మొత్తం 29 మంది కౌన్సిలర్ స్థానాలకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపలకు చెరో 14 స్థానాలు దక్కాయి. ఓ టీడీపీ రెబల్ అభ్యర్థి గెలిచారు. ఆ అభ్యర్థి వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు అధికంగా ఉన్నట్లయింది. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకుని పీఠం కైవసం చేసుకుంటామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Also Read : మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..

అయితే టీడీపీ తరపున విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు విచారణ జరిపి ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే తుది ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఎన్నిక నిర్వహించాలని అనుకున్నా.. వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో వాయిదా పడింది. మంగళవారం కూడా అంతే వాయిదా పడింది. 

Also Read: Tomato Price Today: పెట్రోల్ రేట్లను దాటేసిన టమోటా.. కొన్నిచోట్ల రూ.140, సడెన్‌‌గా పెరుగుదల ఎందుకు?

ఈ క్రమంలో అధికార పార్టీ నేతలతో కలిసి అధికారులు కుమ్మక్కయి ఎన్నికను నిర్వహించడం లేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన హైకోర్టు రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇంచార్జ్ సీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత కల్పించాలని.. ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దాదాపుగా 700 మంది పోలీసులతో భద్రత కల్పించి ఎన్నిక నిర్వహించారు. వీడియో తీశారు. ఈ వీడియోను హైకోర్టుకు సమర్పించనున్నారు. తుది ఫలితం హైకోర్టు తీర్పును బట్టి ఉంటుంది. 

Also Read : ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

Women's Kabaddi World Cup | కబడ్డీ వరల్డ్ కప్‌ ఇండియాదే
Karun Nair Crypitc Post Ind vs SA | ట్విట్టర్ వేదికగా కరుణ్ నాయర్ విమర్శలు
India vs South Africa Test Match | కుప్పకూలిన భారత బ్యాట్స్‌మెన్
Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Embed widget