అన్వేషించండి

Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!

TDP Big Fact News | ఏపీలో టీడీపీ, వైసీపీ గురువారం నాడు ఓ భారీ బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ పార్టీ ఏం ప్రకటన చేస్తుందోనని ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TDP and YSRCP announced that they will reveal a big thing at 12 noon on 24 October అమరావతి: ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో గురువారం ఏం జరుగబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ వారిలో సైతం ఉత్కంఠ పెరిగింది. అందుకు కారణంగా తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఇచ్చిన ఓ అప్ డేట్. Big Expose Stay Tunes అని తెలుగుదేశం పార్టీ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. దాంతో వైసీపీ పాలనకు సంబంధించి ఓ పెద్ద రహస్యం గురువారం నాడు టీడీపీ బయట పెట్టనుందని ప్రచారం జరిగింది.

తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు రేపటి కోసం..
ఢిల్లీ వెళ్లి లోకేష్ పేరు కలవరిస్తున్నావ్.. పప్పు పప్పు అంటేనే, పప్పు గుత్తి దించితే, సొంత కొంపలో కూడా ఉండలేక భయపడుతూ బెంగుళూరులో  బతుకుతున్నావ్ అని టీడీపీ సోషల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కనీసం లోకేష్ ను పేరు కూడా పెట్టి పిలవలేదని, ఇప్పుడు చాలా మార్పొచ్చింది అంటున్నారు టీడీపీ నేతలు. అయితే కంగారు పడకు, లోకేష్ అనే పేరునే రేపటి నుంచి నువ్వు కలవరిస్తూనే ఉంటావ్ అని మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కన్న తల్లి, చెల్లినే చూసి ఓర్వలేదు కానీ, ఈయన గుడ్ బుక్ అని రాసి కార్యకర్తలకు మేలు చేస్తాడంట అని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.

ట్రూత్ బాంబు పేల్చుతామన్న వైసీపీ 
టీడీపీ ఎక్స్ ఖాతాలో బిగ్ ఎక్స్ పోజ్ అని ప్రకటన వచ్చిన గంటల్లోనే వైసీపీ స్పందించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ బాంబు వదులబోతున్నామని ఊరించింది. ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్ అంటూ వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే టీడీపీ వదలనున్న బాంబుకు ఇది విరుగుడు బాంబు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది ట్రూత్ బాంబ్ అని, సంచలన వాస్తవాలు వెలుగులోకి తెస్తామని వైసీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ వైసీపీ, టీడీపీ పార్టీలు ఏం చెబుతాయి, ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తాయి, ఏ సంచలన ప్రకటన చేస్తుందోనని రేపటి కోసం ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం జగన్ ఢిల్లీ వేదికగా సైతం ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుడా పోయిందని, ప్రతిపక్షమైన తామే బాధితుల కోసం ఎంతో చేస్తుంటే, అధికారంలో ఉండి కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయని జగన్ మండిపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక బాలికలు, యువతులు, మహిళలపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ అంటోంది.

Also Read: AP CM Chandrababu: చంద్రబాబు తొడ కొట్టారా... పవర్ స్టార్ మేనరిజమ్ చేశారా? రిస్క్‌లో పెట్టిన బాలకృష్ణ డబుల్ టాస్క్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget