అన్వేషించండి

Andhra News: సీఎం వద్దకు తాడిపత్రి - జమ్మలమడుగు ఫ్లైయాష్ వివాదం - జమ్మలమడుగు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Flyash Contract: థర్మల్ ప్రాజెక్ట్ ఫ్లైయాష్ వివాదం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.

CM Chandrababu On Tadipatri - Jammalamadugu Dispute: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy), భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. తాను జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) సమాచారం ఇచ్చారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ జరిగింది

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు, తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పెద్దారెడ్డిలు సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసేవారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిదను తరలించడం ప్రారంభించారు. దీనిపై ఇటీవల ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమలకు సరఫరా కాకుండా ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగగా.. పంచాయతీ సీఎం వద్దకు చేరింది. ఆయన వారితో చర్చించారు.

'ఉపాధి కల్పనకే తీసుకెళ్తున్నాం'

కాగా, సీఎంతో సమావేశమైన అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. 'థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద (ఫ్లైయాష్) పూర్తిగా ఉచితం. పీఎంఈజీపీలో భాగంగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చాం. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్ద లేఖ రాశారు. లేఖ రాసిన వారు స్వయంగా రావాలి కదా.?. విలువ లేని ఫ్లైయాష్ గురించి వివాదం తీసుకొచ్చారు. బూడిదను దూరంగా తీసుకెళ్లడం దేనికి.?. స్థానికులకు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇవ్వాలని సీఎంకు తెలిపాం. దీనిపై మా వివరణ విన్న సీఎం.. పోలీస్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదం పరిష్కరిస్తామన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఆయన ప్రాంతంలో ఉంది కాబట్టే ఫ్లైయాష్ అడుగుతున్నారు. ఏదైనా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సీఎం వద్దకు వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలి. కానీ ఎందుకు రాలేదు.?. లేఖ మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు.' అని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన ఇలాకాలో అల్ట్రాటెక్ పరిశ్రమ ఉంది. అయితే, థర్మల్ విద్యుత్ కేంద్రం మాత్రం జమ్మలమడుగు పరిధిలో ఉంది. అక్కడి నుంచి ఫ్లైయాష్‌ను తాడిపత్రికి సమీపంలోని సిమెంట్ పరిశ్రమకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక నియోజకవర్గంలో బూడిద దొరుకుతుండగా.. మరో నియోజకవర్గంలోని పరిశ్రమకు ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే నేతల మధ్య బూడిద తరలింపు విషయంలో వివాదం నెలకొంది. 

Also Read: YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Nara Lokesh Speech Tribal University Convocation: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget