అన్వేషించండి

Andhra News: సీఎం వద్దకు తాడిపత్రి - జమ్మలమడుగు ఫ్లైయాష్ వివాదం - జమ్మలమడుగు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Flyash Contract: థర్మల్ ప్రాజెక్ట్ ఫ్లైయాష్ వివాదం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.

CM Chandrababu On Tadipatri - Jammalamadugu Dispute: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy), భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. తాను జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) సమాచారం ఇచ్చారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ జరిగింది

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు, తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పెద్దారెడ్డిలు సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసేవారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిదను తరలించడం ప్రారంభించారు. దీనిపై ఇటీవల ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమలకు సరఫరా కాకుండా ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగగా.. పంచాయతీ సీఎం వద్దకు చేరింది. ఆయన వారితో చర్చించారు.

'ఉపాధి కల్పనకే తీసుకెళ్తున్నాం'

కాగా, సీఎంతో సమావేశమైన అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. 'థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద (ఫ్లైయాష్) పూర్తిగా ఉచితం. పీఎంఈజీపీలో భాగంగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చాం. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్ద లేఖ రాశారు. లేఖ రాసిన వారు స్వయంగా రావాలి కదా.?. విలువ లేని ఫ్లైయాష్ గురించి వివాదం తీసుకొచ్చారు. బూడిదను దూరంగా తీసుకెళ్లడం దేనికి.?. స్థానికులకు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇవ్వాలని సీఎంకు తెలిపాం. దీనిపై మా వివరణ విన్న సీఎం.. పోలీస్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదం పరిష్కరిస్తామన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఆయన ప్రాంతంలో ఉంది కాబట్టే ఫ్లైయాష్ అడుగుతున్నారు. ఏదైనా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సీఎం వద్దకు వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలి. కానీ ఎందుకు రాలేదు.?. లేఖ మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు.' అని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన ఇలాకాలో అల్ట్రాటెక్ పరిశ్రమ ఉంది. అయితే, థర్మల్ విద్యుత్ కేంద్రం మాత్రం జమ్మలమడుగు పరిధిలో ఉంది. అక్కడి నుంచి ఫ్లైయాష్‌ను తాడిపత్రికి సమీపంలోని సిమెంట్ పరిశ్రమకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక నియోజకవర్గంలో బూడిద దొరుకుతుండగా.. మరో నియోజకవర్గంలోని పరిశ్రమకు ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే నేతల మధ్య బూడిద తరలింపు విషయంలో వివాదం నెలకొంది. 

Also Read: YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Advertisement

వీడియోలు

SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget