అన్వేషించండి

Subramanian Swamy : బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !

అనువంశిక అర్చకత్వానికి.. బ్రాహ్మణులే అర్చకులుగా ఉండాలన్నదానికి తాను వ్యతిరేకమని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. తనకు రమణదీక్షితులు చేసిన ట్వీట్‌ను చూడలేదన్నారు.


బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలా ? అని తిరుపతిలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో విజ్ఞప్తి మేరకు ఓ పత్రికపై పరువు నష్టం దావా వేసిన ఆయన.. ఆ పని మీద తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలా అని ప్రశ్నించారు. బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదన్నారు. అంతే కాదు అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు.  

Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !

శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఇటీవల సుబ్రహ్మణ్యస్వామి ఓ ట్వీట్ చేశారు. శ్రీవారి ఆలయంలో విధుల్లో ఉన్న వంశపారంపర్య అర్చకుల్లో కొందరిని టీటీడీ అధికారులు శాశ్వతఉద్యోగులుగా మార్చారని ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేద్దామా అని ఆయనను సలహా అడిగారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందన అనూహ్యంగా ఉంది. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకం అని స్పష్టం చేయడమే కాకుండా అసలు బ్రాహ్మణులే అర్చకత్వం చేయాలా అన్న ఓ చర్చను కూడా లేవనెత్తారు. అంతే కాదు.. తనకు రోజు కొన్ని వేల సంఖ్యలో ట్విట్ లు వస్తుంటాయని.. రమణ దీక్షితులు చేసిన ట్వీట్ లు తాను గమనించలేదని తెలిపారు.

Also Read: ఆ అర్చకులకు సంభావన ఇవ్వడంలేదు... గర్భగుడిలో పూజలు చేయనీయడంలేదు... సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్
 
టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ గతంలో ఓ పత్రికలో వార్త వచ్చిందని.. ఆ విషయంలో టీటీడీ విజ్ఞప్తి మేరకు తాను రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు. హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా ముందుంటానని స్పష్టం చేశారు. దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని అన్నారు. 

Also Read: కల నెరవేరదూ.. ట్వీట్లు ఆగవు.. మళ్లీ లైమ్ లైట్ లోకి రమణ దీక్షితులు

దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించను, న్యాయపోరాటం చేస్తా.. అసత్య వార్తలు రాసిన తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలి లేకపోతే 100 కోట్లు జరిమాన చెల్లించాలని డిమాండ్ చేశారు. 

Also Read: వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Govt Alert: ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AAP MLAs Suspension: ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
Kayadu Lohar: తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Alert: ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AAP MLAs Suspension: ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
Kayadu Lohar: తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Embed widget