అన్వేషించండి

Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, నేడు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Jagananna Amma Vodi : జగనన్న అమ్మ ఒడి పథకం కింద వరసగా మూడో ఏడాది లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయనున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం చేయనున్నారు.

Jagananna Amma Vodi : పేదరికం కారణంగా ఎవరూ బడిమానేయకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేస్తుంది.  కనీసం 75 శాతం అటెండెన్స్‌ ఉండాలని ఇందుకు నిబంధన పెట్టింది ప్రభుత్వం. 2019లో ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడే ఆ జీవోలోనే నిబంధనలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలో కరోనా కారణంగా విద్యాసంస్థలు అనుకోకుండా మూతపడడడంతో 2020–21 విద్యా సంవత్సరాలకు అటెండెన్స్‌ నిబంధన నుంచి సడలింపు నిచ్చింది. 

75 శాతం హాజరు నిబంధన 

గత సెప్టెంబర్‌ నుంచి విద్యా సంస్థలు యథావిధిగా పనిచేస్తున్నందున స్కూల్స్‌ నడిచిన రోజుల్లో 75 శాతం హాజరు నిబంధన తిరిగి అమలుచేయడంతో 2021–22లో 51,000 మంది అమ్మ ఒడి లబ్ధిని పొందలేకపోయారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. అప్పుడే ప్రభుత్వం అమలుచేస్తున్న జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, సీబీఎస్‌ఈతో బైజూస్‌ ఒప్పందంతో నాణ్యమైన విద్య వంటి కార్యక్రమాల లక్ష్యం నెరవేరినట్లు అవుతుందన్నారు. పిల్లలకు పూర్తి లబ్ధి చేకూరుతుందని, ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

నాడు నేడు ఫండ్ 

మన బడి నాడు-నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యా్ర్థులకు అందాలన్న తపనతో అమ్మ ఒడి నిధుల నుంచి నాడు నేడులో స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌) కు రూ. 1,000 ప్రభుత్వం జమ చేస్తుంది. స్కూళ్లలో టాయిలెట్లు లేక ఆడపిల్లలు బడులు మానేసే దుస్థితి మారుస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద నిర్మించిన బాలికల ప్రత్యేక టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల మెయింటెనెన్స్‌ కోసం అమ్మ ఒడి పథకం నిధుల నుంచి టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) కు రూ. 1,000 జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిర్వహణలో ఏవైనా లోపాలుంటే హక్కుగా అడిగే పరిస్థితులను తల్లులకు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం పెరిగేలా పాఠశాల మెయింటెనెన్స్‌ ఫండ్, టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ ల నిర్వహణ బాధ్యత కూడా హెడ్‌మాస్టర్లు, పేరెంట్స్‌ కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది. 

  • 2019–20 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది లబ్ధిదారులకు చేసిన ఆర్థిక సాయం రూ. 6,349.53 కోట్లు
  • 2020–21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది లబ్ధిదారులకు చేసిన ఆర్థిక సాయం రూ. 6,673.00 కోట్లు 
  • 2021–22 విద్యా సంవత్సరంలో 43,96,402 మంది లబ్ధిదారులకు చేసిన ఆర్థిక సాయం రూ. 6,595.00 కోట్లు

శ్రీకాకుళంలో అమ్మఒడికి శ్రీకారం 

ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జూన్ 27వ తేదీన లబ్దిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బటన్‌ నొక్కి సీఎం వైఎస్‌ జగన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సోమవారం అందిస్తున్న రూ. 6,595 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద దాదాపు రూ. 19,618 కోట్లు అందించింది ప్రభుత్వం. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget