By: ABP Desam | Updated at : 28 Dec 2021 08:56 PM (IST)
జనాగ్రహ సభలో సోము వీర్రాజు
కమ్యూనిస్టులు.. దేశానికి పట్టిన చీడ పురుగులు అని సోము వీర్రాజు విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం వైసీపీ, టీడీపీ ఏమీ చేయలేదని విమర్శించారు. తమకు అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ జనాగ్రహ సభలో భాగంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. రాజధానిపై ఏడువేల కోట్లు ఖర్చు చేశామన్న వారిని రైతులు నిలదీయాలని సోము వీర్రాజు అన్నారు.
అమరావతిని రాజధానిగా బీజేపీ నమ్మింది. ఇక్కడే రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించాం. ఎయిమ్స్ ను కూడా మంగళగిరిలో నిర్మించాం. అలాగే రాజధాని కోసం వేలకోట్లు ఇచ్చాం. ఇక ఉత్తరాంద్ర, రాయలసీమను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీనే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ పార్టీలన్నీ కమీషన్లతో కాలక్షేపం చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం నిధులిస్తుంటే జగన్,చంద్రబాబు స్టిక్కర్లు వేసి ప్రచారం చేసుకున్నారు. స్కూళ్ల బలోపేతానికి కేంద్రం రూ.4వేల కోట్లు ఇస్తే నాడు-నేడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ లాంటి విద్య అందాలనే లక్ష్యంతో విద్యావిధానాన్ని బీజేపీ ప్రభుత్వమే అమల్లోకి తెచ్చింది.
- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
'వైసీపీ ప్రభుత్వం రూ.3రూపాయల మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి విక్రయిస్తున్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70 చీప్ లిక్కర్ ఇస్తాం.. ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తాం. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉంది.' అని సోము వీర్రాజు అన్నారు.
Also Read: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్పై స్టే
ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?