By: ABP Desam | Updated at : 28 Dec 2021 06:34 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ
ర్మా రంగంలో దిగ్గజ కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా ఏపీలో తయారీ ప్లాంట్ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్గా ఈ ప్లాంట్ ను తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్ను సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ కలుసుకున్నారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సన్ ఫార్మా ప్రతినిధులకు వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి చర్యలను సీఎం జగన్ వివరించారు. పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడంద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత దిలీప్ షాంఘ్వీ మాట్లాడారు.
Also Read: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టి : సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ
ఏపీ సీఎం జగన్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ ఉందన్నారు. షాంఘ్వీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఎం జగన్ కు పూర్తిగా అవగాహన ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ఆయన విధానంగా స్పష్టమవుతోందన్నారు. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవనవరులను తయారు చేయడం ద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఆయన ముందడుగు వేస్తున్నారన్నారు. తమ కంపెనీ తరఫున తాము కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామన్నారు. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామన్నారు. తద్వారా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని, కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటు చేయడానికి అధికారులతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడించారు. పరిశ్రమలకు చక్కటి ఔషధ రంగంలో ఆలోచనలను ఆయనతో పంచుకున్నామని, ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్పై మాట్లాడుకున్నామన్నారు. ఏపీ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది తమ లక్ష్యాల్లో భాగమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సన్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు విజయ్ పారెఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ పాల్గొన్నారు.
Koo Appఫార్మాస్యూటికల్స్ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో షాంఘ్వీ కలుసుకున్నారు. - YSR Congress Party - YSRCP (@YSRCPOfficial) 28 Dec 2021
Also Read: AP BJP : బెయిల్పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
YSRCP Gajuwaka : వైసీపీలో వరుస రాజీనామాలు - ఆళ్ల తర్వాత గాజువాక ఇంచార్జ్ గుడ్ బై !
Top Headlines Today: వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా! తెలంగాణలో సీఎం క్యాంప్ ఆఫీసు మార్చుతారా?
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
Nelson Dilipkumar: రజనీకాంత్ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
Salaar Runtime: ‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా?
Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!
Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్, మోక్షజ్ఞ
/body>