అన్వేషించండి

AP Cabinet: ఏపీలో 50 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం - ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Andhra: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగపూర్ పర్యటనపై చంద్రబాబు మంత్రులకు వివరించారు.

AP Cabinet decisions:  ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీకి  ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఉత్పాదనను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా తీసుకు వచ్చారు.  మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చ జరిగింది.  దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు. 

స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ద్వారా సుమారు ₹50,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.  ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు ఉద్యోగ సృష్టికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. అలాగే  క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సంబంధిత ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సంబంధించిన నాలా చట్ట సవరణపై చర్చ జరిగింది. ఈ సవరణ భూమి ఉపయోగ నియమాలను సరళీకరించడం ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను సులభతరం  చేస్తాయి. 

లే ఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్ట సవరణలపై చర్చ జరిగింది.   వీఎంఆర్డీఏ పరిధిలో భూసమీకరణపై, నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ ప్యాకేజీలపై,  ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్లకు కమిటీ సిఫార్సులపై ,  వార్డు వెల్ఫేర్, డెవలప్ మెంట్ కార్యదర్శి పోస్టుల అప్ గ్రేడ్ పై చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు.  విద్యుత్ జల వనరుల శాఖకు చెందిన పనులపై, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్, తిరుపతిలో తొక్కిసలాటపై ఇచ్చిన నివేదికపై, నూర్ బాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ మార్పుపైనా మంత్రులు చర్చించారు.

సింగపూర్ పర్యటనపైనా చంద్రబాబు స్పందించారు.  గతంలో రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం ఏపీకి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన తరువాత వారిని వెళ్లగొట్టారు.  గత వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ కన్సార్టియం వారిపై అవినీతి ముద్ర వేసి కేసులు పెట్టేందుకు యత్నించారన్నారు. సింగ్ పూర్ వారితో ఉన్న మంచి సంబందాలను చెడగొట్టారని..  మళ్లీ వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.                             

తిరుపతి తొక్కిసలాటపై నివేదిక మేరకు బాధ్యులపై చర్యలుతతీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. విచారణ కమిటీ అప్పటి గో సంరక్షణ శాల ఉన్నతాధికారిని బాధ్యుడిని చేసింది. ఆ అధికారిపైచర్యలు తీసుకోనున్నారు. తిరుపతి ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget