అన్వేషించండి

Congress Party News: వైసీపీ అసంతృప్తులు కాంగ్రెస్‌ వైపు ఎందుకు చూస్తున్నారు?

YSRCP News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా అధికార వైఎస్సార్‌ సీపీలో నలుగురు వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు టిక్కెట్టు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే టచ్‌లోకి వెళ్లిపోయారు.

AP Elections News 2024: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారా..? పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టిక్కెట్టు ఆశించి భంగపడ్డ వారు చాలా మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరి పార్టీ టిక్కెట్టు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారట. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా అధికార వైఎస్సార్‌ సీపీలో నలుగురు వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు టిక్కెట్టు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే టచ్‌లోకి వెళ్లిపోగా ఒక్క వైసీపీ నాయకులే కాదు ఇతర పార్టీలో ఉన్న వారు కూడా కాంగ్రెస్‌ గనుక టిక్కెట్టు హామీ ఇస్తే వెంటనే జంప్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది నేరుగా కడపకు క్యూ కడుతున్నారట.. డైరెక్ట్‌గా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అపాంయింట్‌మెంట్‌ తీసుకుని మరీ కలిసి వస్తున్నారు.. ఏపీలో ఏమాత్రం ఓటు షేరులేని కాంగ్రెస్‌ పార్టీ వైపుకు మరి ఎందుకు చూస్తున్నారు? అసలు కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో భవిష్యత్తు ఉందా అని అడిగితే.. మా ఉనికిని చాటుకోవాడానికి అయితే పనికొస్తుంది కదా అంటూ బదులిస్తున్నారట. 

పి.గన్నవరం ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి..
పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సారి టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిలో ముందు వరుసలో ఉన్నారు.. ఆయనకు కాదని ఇక్కడ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న విప్పర్తి వేణుగోపాలరావుకు వైసీపీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో మిగిలిపోగా ఆయన చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. వైసీపీ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లినా కనీసం తలుపు తీయని పరిస్థితి కనిపించింది. చాలా సేపు వేచి చూశాక చివరకు వచ్చి ముభావంగా పాంప్లెట్‌ తీసుకున్నారు. అయితే ఈ అసంతృప్తి వెనుక ఉన్న రివేంజ్‌ను ఎలా తీర్చుకోవాలి.. ఆయన అనుచరులు చాలా మంది స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని సలహా ఇచ్చారట.. అయితే ఆయన దానికి అంగీకరించకపోగా చివరకు జమ్మలమడుగు వెళ్లిమరీ వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

రివేంజ్‌ తీర్చుకునేందుకు వేదికగా కాంగ్రెస్‌
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఎన్నికల ప్రచారం నుంచి పోలీంగ్‌ బూత్‌ ఏజెంట్లును ఏర్పాటు చేసుకుని ఆఖరికి లెక్కింపు ఏజెంట్లు ఏర్పాటు వరకు ఒకటే ఖర్చు.. ఎలా చూసుకున్నా తడిపి మోపెడవుతోంది.. మరో పక్క ఇండిపెండెంట్‌ అభ్యర్ధికి ఏ గుర్తు వస్తుందో తెలియదు.. విధం చెడినా ఫలితం దక్కాలన్న సామెత ఇక్కడ పనిచేస్తోందట.. జాతీయ పార్టీ, పైగా హస్తం గుర్తు అందరికీ తెలిసిన గుర్తు.. ఎంతో కొంత ఎన్నికల ఫండిరగ్‌ రానే వస్తుంది... ఇంక భయం ఎందుకు అభయ హస్తం ఉండగా అంటూ కాంగ్రెస్‌ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారట.. అయితే వీటికన్నిటికంటే ప్రధానంగా ఇందులో ఏదోలా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యమే ఎక్కువగా దాగుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనను కాదని వేరే అభ్యర్ధికి టిక్కెట్టు ఇస్తారా... అంటే టిక్కెట్టు కేటాయించిన వాని కంటే తానే పనికిరానివాడనా... కనీసం ఓ అయిదువేల ఓట్లు అయినా చీల్చలేనా.. అంటూ ఎన్నికల బరిలో కాలు దువ్వుతున్నారట.. అవసరమైతే కొన్ని చోట్ల ప్రత్యర్ధితో సైతం టచ్‌లో వెళ్లి కాంగ్రెస్‌ తరపున పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నాను.. నా ప్రచారానికి మీరు కూడా సహకరించండి.. మీకు చాలా ప్రయోజనం ఉంటుందని భరోసా ఇస్తున్నారట.. 

మరింత మంది కాంగ్రెస్‌లోకి చేరిక..
ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిక్కెట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ కూడా ఎప్పటినుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌నే నమ్ముకున్న వారు ఈ పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారట.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget