అన్వేషించండి

ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్

రూ 12 వేల కోట్ల రూపాయలు అదానీకి రుణమాఫీ చేశారని, దాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అత్యవసరంగా కేసులు వేసి, ఆగమేఘాల మీద కోర్టులో తీర్పు వచ్చేలా చేశారని హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్లో రాహుల్ గాంధీ పై వేయడం పార్లమెంట్ చరిత్రలో దురదృష్ట సంఘటన అని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయని అన్నారు. రూ 12 వేల కోట్ల రూపాయలు అదానీకి రుణమాఫీ చేశారని, ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అత్యవసరంగా కేసులు వేసి, ఆగమేఘాల మీద కోర్టులో తీర్పు వచ్చేలా చేసి పార్లమెంట్ నుంచి గెంటి వేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై ఫ్రీ ప్లాంట్ గాని కేసులు పెట్టి అనర్హత వేటు వేశారని విమర్శించారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నప్పటికీ విమర్శించకూడదని ప్రతిపక్షాలకు స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు.  

ప్రతిపక్షాలు గొంతు నొక్కిందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి చెందిన తరువాత ఆమె స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి గా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం ఆమెపై కేసులు పెట్టి జైల్లో పెట్టిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 2014 ఎన్నికలలో రుణాలు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతున్న వారిని తీసుకువచ్చి రుణాలు వసూలు చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు ఎగవేసిన వారిని రహస్యంగా విదేశాలకు పంపిస్తున్నారని అన్నారు. ఓఎన్జీసీ అండర్ గ్రౌండ్ బావులు నుంచి అంబానీ చమురు దొంగతనం చేశారని ఆరోపించారు. రూ 45 వేల కోట్లు ఖర్చుతో పిపి మోడల్ కింద అంబానీ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారని,  అయితే 2004 నుంచి దానికి అంత ఖర్చు అయింది ఎంత మిగిలింది పెట్రోల్ బంకులు ప్రభుత్వానికి ఎప్పుడు చెప్తారు అనేది ఇప్పటికీ చెప్పడం లేదని అన్నారు.

దళిత క్రిస్టియన్ లను ఎస్సీల్లో చేర్చినా  ఒరిగేదేమీ లేదు :
రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేస్తూ తీర్మానం ఆమోదించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసి దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేరుస్తూ సోనియా గాంధీ పార్లమెంట్లో తీర్మానం చేశారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం దానిని అడ్డుకోవడంతో బిల్లు ఆమోదించలేదని అన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను ఎత్తివేసిందని, అమ్మ ఒడి పేరుతో విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక సహాయం గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే తక్కువేనని అన్నారు.

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని, దీనికి కారణం జగన్ ఒంటెత్తిపోకడలే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. దళితులపై దాడులు చేసిన వారిని కేసులు పెట్టి అరెస్టు చేయకుండా వారిని రక్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగాయని  గెడ్డం శ్రీను, డాక్టర్ సుధాకర్ తదితరులు పై దాడులు జరిగిన నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు. పూజారులకు పాస్టర్లకు ఇమామ్ లకు గౌరవ వేతనం ఇస్తానని ఒక నెల మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేస్తాం :

పేద ప్రజల ను  ఆదుకునేందుకు పే బ్యాక్ టు సొసైటీ విధానంతో నేషనల్ అప్పర్ క్లాసెస్ ట్రస్ట్  స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సమయంలో కొందరు పనులు లేక పస్తులు ఉన్నారని, కొందరికి వైద్య సహాయం అందలేదని ఇలాంటి వారి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో తనతోపాటు యర్రా రామకృష్ణ తదితరులు ఉంటారని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget