అన్వేషించండి

Godavari Floods: తగ్గని వరద, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి: తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత

Godavari Floods: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రతి గంటకు 25.33 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు.

గోదావరి నది కి పోటెత్తిన వరదల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరిగిన నీటి మట్టాన్ని తగ్గించడానికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు. ధవళేశ్వరం నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత 12 గంటల నుంచి నీటిని సాధ్యమైనంత వరకు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు సహకరించాలన్న కలెక్టర్.. 
జూలై 16వ తేదీ శనివారం రాత్రి  8.00 గంటలకు 25.33 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేయగా..  రాత్రి 11కి  25.59 , అర్ధరాత్రి 12 వరకు 25.63 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి 1 గంటకి  25.63 లక్షల క్యూసెక్కులు,  2 గంటలకు 25.77 , ఉదయం 3 వరకు  25.80 , ఉదయం 4 వరకు  25.80, ఉదయం  5 గంటల వరకు 25.8 , ఉదయం 6 కు   25.80, ఉదయం 7 గంటలకు 25.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. గత 4 గంటలుగా బ్యారేజ్ నుంచి 25.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని స్థిరంగా విడుదల చేయడం జరుగుతోందని చెప్పారు. రాబోయే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

గోదావరి వరద ఉధృతి వల్ల ధవళేశ్వరం బ్యారేజి వద్ద  గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  25.29  లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల కారణంగా 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 645 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో మొత్తం  10 ఎన్డీఆర్ఎఫ్,  10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని.. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో  324 గ్రామాలు వరద ప్రభావితమైనవని ప్రకటనలో తెలిపారు.

మరో 191 గ్రామల్లో చేరిన వరదనీరు...
గోదావరికి వరద నీటితో ఇప్పటివరకు 76,775 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 67,601 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు 243 మెడికల్ క్యాంప్స్ నిర్వహణ,54,823 ఆహార ప్యాకేట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం ఉందని, పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రజలను అప్రమత్తం చేశారు.
గోదావరి నదీపాయలో వ్యక్తి గల్లంతు
కోనసీమల జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన కడలి శ్రీనివాసరావు(50) గోదావరి నదీపాయిలో గల్లంతయ్యాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గల్లంతు అయినట్లు సమాచారం. పడవ దాటించే వద్ద అధికారులు ఎవరూ లేకపోవడంతో వరద ఉధృతిలోనే వెళ్లిపోయే ప్రయత్నం చేసిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ టీమ్‌తో కలిసి పడవుల పై గాలింపు చర్యలు చేపట్టారు.

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget