అన్వేషించండి

Godavari Floods: తగ్గని వరద, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి: తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత

Godavari Floods: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రతి గంటకు 25.33 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు.

గోదావరి నది కి పోటెత్తిన వరదల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరిగిన నీటి మట్టాన్ని తగ్గించడానికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు. ధవళేశ్వరం నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత 12 గంటల నుంచి నీటిని సాధ్యమైనంత వరకు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు సహకరించాలన్న కలెక్టర్.. 
జూలై 16వ తేదీ శనివారం రాత్రి  8.00 గంటలకు 25.33 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేయగా..  రాత్రి 11కి  25.59 , అర్ధరాత్రి 12 వరకు 25.63 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి 1 గంటకి  25.63 లక్షల క్యూసెక్కులు,  2 గంటలకు 25.77 , ఉదయం 3 వరకు  25.80 , ఉదయం 4 వరకు  25.80, ఉదయం  5 గంటల వరకు 25.8 , ఉదయం 6 కు   25.80, ఉదయం 7 గంటలకు 25.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. గత 4 గంటలుగా బ్యారేజ్ నుంచి 25.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని స్థిరంగా విడుదల చేయడం జరుగుతోందని చెప్పారు. రాబోయే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

గోదావరి వరద ఉధృతి వల్ల ధవళేశ్వరం బ్యారేజి వద్ద  గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  25.29  లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల కారణంగా 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 645 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో మొత్తం  10 ఎన్డీఆర్ఎఫ్,  10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని.. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో  324 గ్రామాలు వరద ప్రభావితమైనవని ప్రకటనలో తెలిపారు.

మరో 191 గ్రామల్లో చేరిన వరదనీరు...
గోదావరికి వరద నీటితో ఇప్పటివరకు 76,775 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 67,601 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు 243 మెడికల్ క్యాంప్స్ నిర్వహణ,54,823 ఆహార ప్యాకేట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం ఉందని, పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రజలను అప్రమత్తం చేశారు.
గోదావరి నదీపాయలో వ్యక్తి గల్లంతు
కోనసీమల జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన కడలి శ్రీనివాసరావు(50) గోదావరి నదీపాయిలో గల్లంతయ్యాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గల్లంతు అయినట్లు సమాచారం. పడవ దాటించే వద్ద అధికారులు ఎవరూ లేకపోవడంతో వరద ఉధృతిలోనే వెళ్లిపోయే ప్రయత్నం చేసిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ టీమ్‌తో కలిసి పడవుల పై గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Oasis Fertility : కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 
కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 
Adulterated Milk : పాలు తాగాలంటే భయంగా ఉందా? కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించే ఈజీ చిట్కాలు ఇవే
పాలు తాగాలంటే భయంగా ఉందా? కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించే ఈజీ చిట్కాలు ఇవే
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
Rajamahendravaram Milk Adulteration: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. యూరియా కలపలేదు, మరణాలకు కారణం ఇదేనా!
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. యూరియా కలపలేదు, మరణాలకు కారణం ఇదేనా!

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
India Israel FTA: ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Embed widget