అన్వేషించండి

Laxminarayana: సేంద్రీయ సాగులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, స్వయంగా పొలంలో నాట్లు!

Laxminarayana: కాకినాడ జిల్లాలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. కౌలుకు తీసుకున్న పొలంలో స్వయంగా నాట్లు వేసి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.  

CBI EX JD Laxminarayana: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామ పరిధిలో ఉన్న పన్నెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ వరి నాట్లు వేశారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని లక్ష్మీనారాయణ కౌలుకు తీసుకున్ని సాగు చేస్తుండగా పూర్తిగా సేంద్రీయ పద్దతిలో మాత్రమే పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసుకున్న కూలీలతో వ్యవసాయ పనులు ప్రారంభించగా కూలీలతో పాటు ఆయన కూడా పొలంలో దిగి నాట్లు వేశారు. దీంతో ఆయన అభిమానులు కూడా పొలంలోకి దిగి నాట్లు వేశారు.

ఆదర్శ వ్యవసాయం చేయాలంటున్న లక్ష్మీ నారాయణ.. 

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూడా రసాయన ఎరువుల వినియోగం ఎక్కువ అయిందని.. దాని వల్ల సారవంతమైన భూమి నిస్సారంగా మారడంతోపాటు మనం తినే ఆహారం పూర్తిగా విషాహారంగా మారుతోందని లక్ష్మీ నారాయణ వివరించారు.  దీనిని నియంత్రించేందుకు రైతులంతా సేంద్రీయ సాగు వైపుకు మళ్లాలని మాజీ జేడీ స్థానిక రైతులకు సూచించారు. మన చేతితో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే సేంద్రియ సాగు చేయాలని స్పష్టం చేశారు. సేంద్రీయ సాగు ద్వారా పెట్టుబడులు గణనీయంగా తగ్గడంతో పాటు సారవంతమైన పంటను పొందగలగుతామని, ప్రభుత్వాలు కూడా రైతులను సేంద్రీయ సాగువైపు మళ్లేలా మరింత ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడే ప్రజల ఆరోగ్యంతో పాటు అన్నీ బాగుంటాయని వివరించారు. 

వ్యవసాయంపై మక్కువతోనే.. 

దేశం గర్వించదగ్గ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో ఉన్నత పదవిని స్వీకరించిన లక్ష్మీ నారాయణ పదవీ విరమణ అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని చేయడం చూసిన వారు, అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం, రాచపల్లి గ్రామాల్లో ఏకంగా 12 ఎకరాల భూమిని కౌలు తీస్కొని పూర్తిగా సేంద్రీయ విధానంలోనే పంటలు పండించడం ఆదర్శంగా నిలుస్తోంది. వ్యవసాయానికి దూరం అవుతున్న ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను మరికొందరు తెలుసుకునేలా చేస్తుంది. 


Laxminarayana: సేంద్రీయ సాగులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, స్వయంగా పొలంలో నాట్లు!

ఎన్ని ప్రభుత్వాలొచ్చినా మారని పరిస్థితి..

దేశానికి రైతే రాజు, జై జవాన్, జై కిసాన్,  రైతు లేనిదే రాజ్యం లేదు.. వంటి అనేక నినాదాలు ఎన్ని ఉన్నా రైతులకు ఆధారమైన వ్యవసాయ రంగం అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈమధ్య కాలంలోనే పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. రైతుల ఆత్మహత్యలు కాస్త తగ్గాయనే చెప్పొచ్చు. భారత దేశంలో ఇప్పటికీ దాదాపుగా 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

రోజురోజుకు అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా ఒక్క రైతు పండించిన పంట ధర మాత్రమే పెరగడం లేదు. వస్తువులు తయారు చేసిన వ్యక్తులే ధరలను నిర్ణయిస్తుండగా.. కేవలం రైతు పండించిన పంటకు మాత్రమే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయి. అయితే చాలా మంది రైతులు, కౌలు రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర లేక.. నష్టాల పాలవుతున్నారు. రైతులే తాము పండించిన పంటకు ధర నిర్యించే పరిస్థితి మారిన నాడే అన్నదాతల బతుకులు గాడిలో పడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Embed widget