అన్వేషించండి

Raghurama Vs YSRCP : వివేకా కేసులో సీబీఐ రూ. ఐదు లక్షలిస్తే సీఎం జగన్ రూ. కోటి ఇవ్వాలని రఘురామ సూచన..!

వివేకా హత్య కేసులో సమాచారం చెప్పిన వారికి ఐదు లక్షలు ఇస్తామన్న సీబీఐ ప్రకటనతో అనుమానాలు ప్రారంభమయ్యాయని రఘురామ వ్యాఖ్యానించారు. రూ. ఐదు లక్షల కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకోలేరని ఆయన అంటున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని సీబీఐ ఇచ్చిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో రూ. ఐదు లక్షలకు ఆశ పడి వివరాలు చెప్పేందుకు ఎవరూ బయటకు రారని ఎంపీ స్పష్టం చేశారు. వారి ప్రాణాలకు గ్యారంటీ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అందుకే హత్యకేసుకు సంబంధించి నిజాలు తెలిపినవారికి ... సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ రూ.కోటి బహుమానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న  శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య గావించబడ్డాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరిపిన చాలా రోజుల తర్వాత పేపర్ ప్రకటన ఇవ్వడంతో తనకు చాలా మంది ఫోన్లు చేశారని.. ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని ఇలాంటి సమయంలో వివరాలు చెప్పేందుకు వచ్చే వారికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.  

వరుసగా విడుదలవుతున్న ఆడియో టేపులను టీడీపీ నేత నారా లోకేష్ మిమిక్రి ఆర్టిస్టులను పెట్టి తయారు చేయిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఆరోపణలపై కూడా రఘురామ స్పందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష ఇచ్చి వంద మంది మిమిక్రి ఆర్టిస్టులను లోకేష్ పెట్టుకున్నారని ఆర్కే చెబుతున్నారని వంద మంది మిమిక్రి ఆర్టిస్టులు కలిపి చేసింది మూడు ఆడియోలేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి రూ. పదిహేను కోట్లు తీసుకుని మూడు ఆడియోలే చేసిన కళకారుల్ని పట్టుకుని శిక్షించాలన్నారు. ఆళ్ల తన దగ్గర ఉన్న మిమిక్రి ఆర్టిస్టుల పేర్లను డీజీపీకి ఇవ్వాలన్నారు. లేకపోతే పార్టీకి చెడ్డపేరు వస్తోందని గుర్తుచేశారు.  
 
రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లపై అప్పులు తీసుకోవాలని చూస్తున్నారని, తప్పుడు పద్ధతిలో కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేయడం మంచిది కాదని సూచించారు. ఏపీ మద్యం ఆదాయం ఎక్కడికి పోతోందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూల్స్‌గా మార్చేసినందున ఇక అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి రఘురామ సూచించారు. ఎక్కువగా నిధులు ప్రైవేటు స్కూల్ విద్యార్థులకే వెళ్తున్నాయన్నారు. ఆ నిధులను మంచి విద్య, వైద్యం కోసం కేటాయించాలన్నారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సీఎం జగన్ విందుకు పిలిచారని మర్యాదపూర్వకంగా పిలిచారు.. మర్యాదపూర్వకంగా వెళ్లారని అందులో వేరే అర్థాలేమీ ఉండవని రఘురామ వ్యాఖ్యానించారు. అలా భేటీ అయినంత మాత్రాన కేంద్రమంత్రివర్గంలోకి వైసీపీని తీసుకుంటారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget