అన్వేషించండి

Raghurama Vs YSRCP : వివేకా కేసులో సీబీఐ రూ. ఐదు లక్షలిస్తే సీఎం జగన్ రూ. కోటి ఇవ్వాలని రఘురామ సూచన..!

వివేకా హత్య కేసులో సమాచారం చెప్పిన వారికి ఐదు లక్షలు ఇస్తామన్న సీబీఐ ప్రకటనతో అనుమానాలు ప్రారంభమయ్యాయని రఘురామ వ్యాఖ్యానించారు. రూ. ఐదు లక్షల కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకోలేరని ఆయన అంటున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని సీబీఐ ఇచ్చిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో రూ. ఐదు లక్షలకు ఆశ పడి వివరాలు చెప్పేందుకు ఎవరూ బయటకు రారని ఎంపీ స్పష్టం చేశారు. వారి ప్రాణాలకు గ్యారంటీ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అందుకే హత్యకేసుకు సంబంధించి నిజాలు తెలిపినవారికి ... సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ రూ.కోటి బహుమానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న  శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య గావించబడ్డాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరిపిన చాలా రోజుల తర్వాత పేపర్ ప్రకటన ఇవ్వడంతో తనకు చాలా మంది ఫోన్లు చేశారని.. ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని ఇలాంటి సమయంలో వివరాలు చెప్పేందుకు వచ్చే వారికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.  

వరుసగా విడుదలవుతున్న ఆడియో టేపులను టీడీపీ నేత నారా లోకేష్ మిమిక్రి ఆర్టిస్టులను పెట్టి తయారు చేయిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఆరోపణలపై కూడా రఘురామ స్పందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష ఇచ్చి వంద మంది మిమిక్రి ఆర్టిస్టులను లోకేష్ పెట్టుకున్నారని ఆర్కే చెబుతున్నారని వంద మంది మిమిక్రి ఆర్టిస్టులు కలిపి చేసింది మూడు ఆడియోలేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి రూ. పదిహేను కోట్లు తీసుకుని మూడు ఆడియోలే చేసిన కళకారుల్ని పట్టుకుని శిక్షించాలన్నారు. ఆళ్ల తన దగ్గర ఉన్న మిమిక్రి ఆర్టిస్టుల పేర్లను డీజీపీకి ఇవ్వాలన్నారు. లేకపోతే పార్టీకి చెడ్డపేరు వస్తోందని గుర్తుచేశారు.  
 
రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లపై అప్పులు తీసుకోవాలని చూస్తున్నారని, తప్పుడు పద్ధతిలో కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేయడం మంచిది కాదని సూచించారు. ఏపీ మద్యం ఆదాయం ఎక్కడికి పోతోందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూల్స్‌గా మార్చేసినందున ఇక అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి రఘురామ సూచించారు. ఎక్కువగా నిధులు ప్రైవేటు స్కూల్ విద్యార్థులకే వెళ్తున్నాయన్నారు. ఆ నిధులను మంచి విద్య, వైద్యం కోసం కేటాయించాలన్నారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సీఎం జగన్ విందుకు పిలిచారని మర్యాదపూర్వకంగా పిలిచారు.. మర్యాదపూర్వకంగా వెళ్లారని అందులో వేరే అర్థాలేమీ ఉండవని రఘురామ వ్యాఖ్యానించారు. అలా భేటీ అయినంత మాత్రాన కేంద్రమంత్రివర్గంలోకి వైసీపీని తీసుకుంటారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Kakuda Trailer: ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
SSMB29: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
India Pakistan: ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
Embed widget