అన్వేషించండి

ZPTC ByElections: చెదురుమదురు ఘటనలతో ముగిసిన జడ్పీటీసీ పోలింగ్ - ఎన్నిక రద్దు చేయాలన్న వైసీపీ - గురువారం ఫలితాలు !

Pulvendula: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. గురువారం కౌంటింగ్ జరగనుంది.

Polling for ZPTC by elections ends amid tensions: కడపజిల్లాలో రెండు రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఒంటి మిట్టలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగడంతో అక్కడకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్లారు. పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన సమయంలో కొన్ని చోట్ల.. పోలింగ్ స్టేషన్లకు దూరంగా దాడులు జరిగాయి. ఆ తర్వాత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.        

అన్ని పార్టీల ముఖ్య నేతల హౌస్ అరెస్టులు        

ఉదయమే అన్ని పార్టీల ముఖ్య నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎంపీ అవనాష్ రెడ్డిలను ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వారిని వదిలి పెట్టారు. అయితే మధ్యలో అవినాష్ రెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులకు తెలియకుండా వచ్చేసి పులివెందుక వైసీపీ ఆఫీసుకు వెళ్లడం ఉద్రిక్తలకు కారణం అయింది. అక్కడ డీఎస్పీ .. వైసీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి కాల్చిపడేస్తానని హెచ్చరించడం వివాదాస్పదమయింది.          

ఎనభై శాతం వరకూ పోలింగ్        

పోలింగ్ దాదాపుగా ఎనభై శాతం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు  తీరారు. అన్ని చిన్న చిన్న గ్రామాలే అయినా.. వర్గ పోరాటాలు ఉండటంతో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ సతీష్ కుమార్ అక్కడే రోజంతా ఎన్నికలను పర్యవేక్షించారు. వైసీపీ నేతలు ఎన్నికలు సరిగ్గా జరగలేదని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకు వచ్చారని ఆరోపించారు. గ్రామాల్లోని మహిళలు వారి ఓట్లను వారిని వేయనివ్వలేదని.. రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.                   

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపణ              

ఈ ఎన్నికలు సరిగ్గా జరగలేదని.. న్యాయపోరాటం చేస్తామని వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కడపలోని ఉర్దూ యూనివర్సిటీకి తరలించారు. గురువారం ఉదయం కౌంటింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ల ఎన్నిక కావడంతో .. గురువారం సాయంత్రానికి ఫలితంపై స్పష్టత వస్తుంది.  ఈ ఎన్నికలపై ఇప్పటికే పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.   

ఓడిపోతారని తెలిసే వైసీపీ ఆరోపణలు చేస్తోందంటున్న టీడీపీ  

వైసీపీ నేతల స్పందన నిరాశాజనకంగా ఉంది. తాము గెలుస్తామని వారు చెప్పడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తున్నారు. ఫలితాలు రాక ముందే ఓటమికి కారణాలు చెబుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.  ఈ ఎన్నికపై న్యాయస్థానంలో సవాల్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
Visakha Building Collapse: జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Election Results 2026 Live Updates: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు వేళాయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు వేళాయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
KTR Meeting With Saranya: ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Embed widget